CM YS Jagan: కీలక దశకు చేరుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఇవాళ పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం వైఎస్ జగన్

ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ కొనసాగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కీలక దశకు చేరింది. శరవేగంగా జరుగుతున్న ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.

CM YS Jagan: కీలక దశకు చేరుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఇవాళ పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం వైఎస్ జగన్
Cm Ys Jagan To Visit Polavaram Project
Follow us

|

Updated on: Jul 19, 2021 | 7:27 AM

CM YS Jagan Polavaram Tour: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, 5 కోట్లమంది ప్రజల కలల ప్రాజెక్ట్. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వరప్రదాయని పోలవరం. ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ కొనసాగిన నిర్మాణం కీలక దశకు చేరింది. శరవేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని పరిశీలించేందుకు ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్.. పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. రికార్డ్‌ వేగంతో పనులు జరగుతున్నాయి. ప్రాజెక్ట్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11–12 గంటల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేయనున్నారు.

అయితే, గత ఏడాది డిసెంబర్‌లో పోలవరం పర్యటన చేపట్టిన జగన్‌..ఆ తరవాత కరోనా పెరగడంతో ప్రాజెక్ట్‌ పరిశీలనకు వెళ్లలేకపోయారు. ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరగడంతో మొత్తం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించాలని డిసైడైన సీఎం ఇవాళ పోలవరం పర్యటనకు రెడీ అయ్యారు. మరోవైపు, ప్రాజెక్టు పనులు దగ్గరపడుతుండటంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. స్థానికంగా, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో గోదారి గలగలలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచడంతో దిగువకు ఉరకలెత్తుతోంది గోదారమ్మ. నదీమ తల్లి గలగలలు.. చల్లని గాలులు.. మనసును ఆహ్లాదపరుస్తున్నాయి.

Read Also…  Parliament: నేటి నుంచి పార్లమెంటు వర్షకాల సమావేశాలు.. అస్త్రశస్ర్తాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు.. చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే..!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..