AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టెన్త్ ఫలితాల్లో స్టూడెంట్స్‌కు మంచి మార్కులు.. విమానంలో ప్రయాణం.. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఎంఈవో..

చిన్న చిన్న బహుమతులు చేసిన చిన్న ప్రశంస ఎంతో బూస్ట్ ఇస్తుంది. మరి అలాంటిది మంచి మార్కులు తెచ్చుకుంటే విమానంలో మిమ్మల్ని హైదరాబాద్ తీసుకుని వెళ్తా అని ఎవరైనా చెబితే అప్పుడు ఆ స్టూడెంట్స్ కు అది ఒక పెద్ద వరం లాంటిది. ఓ స్కూల్ కు వెళ్ళిన మండల విద్యాధికారి ఎవరైతే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళని విమానంలో టూర్ కి తీసుకుని వెళ్తానని చెప్పారు. దీంతో ఆ స్కూల్ స్టూడెంట్స్ కష్టపడి చదివారు. మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఇప్పుడు మాట ఇచ్చిన MEO వంతు వచ్చింది. తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

Andhra Pradesh: టెన్త్ ఫలితాల్లో స్టూడెంట్స్‌కు మంచి మార్కులు..  విమానంలో ప్రయాణం.. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఎంఈవో..
Meo Gift To 10th Class Students
Surya Kala
|

Updated on: May 02, 2025 | 2:28 PM

Share

కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలనే కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు కూడా అద్భుతాలు సృష్టిస్తారని నిరుపిస్తూనే ఉన్నారు. ఇటీవల రిలీజైన ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రిజల్ట్ లో అమ్మాయిలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే అనంతరపురం జిల్లాలోని బెళుగుప్ప మండల విద్యాధికారి మల్లారెడ్డి పదోతరగతి స్టూడెంట్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతిలో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను విమానంలో తీసుకెళ్తానని చెప్పారు. దీంతో స్టూడెంట్స్ చాలా కష్టపడి చదివారు. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నారు. టెన్త్ ఫలితాల్లో బెళుగుప్ప మండలంలో ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్య అనే ఐదుగురు అమ్మాయిలు 550 కన్నా ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో MEO మల్లారెడ్డి తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు.

మల్లారెడ్డి స్టూడెంట్స్ ను విమానంలో హైదరాబాద్ కు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. గురువారం స్టూడెంట్స్ ని తీసుకుని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను కలిశారు. అధికారుల అనుమతిని తీసుకున్న అనంతరం ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్యలను తీసుకుని బెళుగుప్ప నుంచి బెంగళూరు వెళ్లారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి స్టూడెంట్స్ తో కలిసి విమానంలో హైదరబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను మల్లారెడ్డి ఆ స్టూడెంట్స్ కు చూపించనున్నారు. ఇలా స్టూడెంట్స్ ప్రయాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే సొంతంగా పెట్టుకున్నట్లు మల్లారెడ్డి చెప్పారు.

అయితే గతంలో కూడా స్టూడెంట్స్ ని బాగా చదివేలా ప్రోత్సహిస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాను చెప్పారు. ఇప్పుడు కూడా అదే విధంగా తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఒక మారు మూల గ్రామం నుంచి స్టూడెంట్స్ కు విమానంలో జాలీగా ప్రయాణించే అవకాశం కల్పించిన ఎంఈవోది దొడ్డ మనసు అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి