Andhra Pradesh: వేగంగా విస్తరిస్తున్న నైరుతి.. వచ్చే మూడు రోజులు వర్ష సూచన

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 4:10 PM

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పటికే ప్రవేశించిన నైరుతి మరింత ముందుకు కదులుతున్నాయి. అంతే కాకుండా తూర్పు ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లోని మరికొన్ని...

Andhra Pradesh: వేగంగా విస్తరిస్తున్న నైరుతి.. వచ్చే మూడు రోజులు వర్ష సూచన
rains
Follow us on

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పటికే ప్రవేశించిన నైరుతి మరింత ముందుకు కదులుతున్నాయి. అంతే కాకుండా తూర్పు ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మధ్యప్రదేశ్, విదర్భలోని మిగిలిన ప్రాంతాలలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య & వాయువ్య బంగాళాఖాతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి వచ్చే మూడు రోజులు మరింత విస్తరించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా.. రాబోయే మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తా, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడి పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈ రోజు, రేపు, ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

మరో వైపు.. నైరుతి రుతుపవనాలు(Monsoon) కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే వచ్చేశాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆదివారమే కేరళ(Kerala) ను తాకినట్లు వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా రుతు పవనాల కదలికల్లో వేగం పెరిగిందని వివరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి