దేశాన్ని కుదిపేసిన విశాఖ గ్యాస్ లీకేజీ..

అర్ధ‌రాత్రి సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో నిద్రావ‌స్థ‌లోనే చాలా మంది అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఆయా గ్రామాల్లో త‌లుపులు ప‌గుల‌గొట్టి మ‌రీ బాధితుల్నిఆసుపత్రులకు త‌ర‌లిస్తున్నారు.

దేశాన్ని కుదిపేసిన విశాఖ గ్యాస్ లీకేజీ..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 07, 2020 | 2:08 PM

అస‌లే క‌రోనా క‌ష్ట‌కాలం, నిన్న‌టి వ‌ర‌కు ఎప్పుడెప్పుడా అన్న‌ట్లుగా నోరు తెరుచుకుని ఉన్న ఎంఫాన్ తుఫాను..ఏపీకి కంటిమీద కునుకులేకుండా చేసింది. అయితే, అదృష్ట‌వ‌శాత్తు తుఫాన్ గండం గ‌డిచింది.  ఇప్పుడిప్పుడే క‌రోనా కేసులు కాస్తా త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని అనుకుంటుండ‌గా,  పాలిమ‌ర్ విష‌వాయువు విశాఖ‌ ఊపిరిని బిగ్గ‌మ‌ట్టేలా చేసింది. విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై దాదాపు రెండు వేల మంది ఆసుపత్రుల పాలయ్యారు. అర్ధ‌రాత్రి సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో నిద్రావ‌స్థ‌లోనే చాలా మంది అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఆయా గ్రామాల్లో త‌లుపులు ప‌గుల‌గొట్టి మ‌రీ బాధితుల్నిఆసుపత్రులకు త‌ర‌లిస్తున్నారు.

విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన పలు కుటుంబాలలో పెను విషాదాన్ని నింపింది. ఆదమరచి నిదురపోతున్నవారిని అదిరిపడి లేచి పరుగులెత్తేలా చేసింది. ఏం జరుగుతోందో తెలిసేలోగా తీవ్ర అస్వస్థతలోకీ, అపస్మారక స్థితిలోకీ నెట్టేసింది. రోడ్లపై పరుగులు తీస్తున్న వారు తీస్తున్నట్లే కుప్పకూలిపోయారు. చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. పశువులు విలవిలలాడాయి. గ్యాస్ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. భూపాల్ గ్యాస్ లీక్ ప్ర‌మాద సంఘ‌ట‌న కంటే విశాఖ ప్ర‌మాదం భ‌యాకంగా క‌నిపించింది. చుట్టూ ఐదు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వ్యాపించిన గ్యాస్ కార‌ణంగా ప‌చ్చ‌ని చెట్లు కూడా రంగుమారి నిర్జీవంగా క‌నిపించాయి. మూగ జీవాల ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం. నోరులేని జీవాలు నుర‌గ‌లు గ‌గ్గుతూ కుప్ప‌కూలిపోయాయి.

ప్ర‌మాద విష‌యం తెలిసిన వెంట‌నే ఏపీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. బాధితుల‌కు కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు సంక్ర‌మంగా అందేలా చూడాల‌ని ఆదేశించారు. సీఎం జ‌గ‌న్ హుటాహుటినా విశాఖ బ‌య‌ల్దేరారు. జ‌రిగిన ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన సమాచారం అందిన వెంటనే గుంటూరు లో వున్న హోమ్ మంత్రి సుచరిత విశాఖపట్నం కలెక్టర్, మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద కారణాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, డిజాస్టర్ డీజీ అనురాధలతో మాట్లాడారు. సహాయక చర్యలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించిన పోలీసులుకేసు న‌మోదు చేశారు.

ఇక‌, కంపెనీ నుండి లీకైన విష‌వాయువు కార‌ణంగా 10 మంది చ‌నిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. సుమారుగా రెండు వేల మంది బాధితులు ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఎక్కువ మంది వెంటిలేట‌ర్స్‌పై నే ఆధార‌ప‌డి ఉన్న‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు. ప్ర‌మాదంలో లీకైన గ్యాస్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, దానివ‌ల్ల మ‌నిషి పూర్తిగా అనారోగ్యం బారిన ప‌డి అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రాణాలు కొల్పోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని చెప్పారు. బాధితుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్దుల‌తో పాటు యువ‌కులు కూడా ఎక్కువ మందే ఉన్నారు.

ప్ర‌ధాని మోడీ కూడా సంఘ‌ట‌న‌పై స్పందించారు.. బాధితుల‌కు అవ‌స‌ర‌మైన వైద్య స‌హాయం అందించాల‌ని ఎపి ప్ర‌భుత్వాన్ని కోరారు.. బాదితులంద‌రూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతో మోడీ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. విశాఖ గ్యాస్ దుర్ఘటన బాధితులకు సహాయం అందించడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది.
కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా విశాఖ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హోంశాఖ కార్యదర్శితో మాట్లాడిన ఆయన గ్యాస్ లీకేజీ ఘటనపై ఆరా తీశారు. మంత్రి అమిత్ షా విశాఖ దుర్ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు.. బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై తెలంగాణ  ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జ‌రిగిన‌ ఘటన గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని, ఏడాది చాలా భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..