AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఎంపీపై జగన్ ఫైర్?

కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ను గౌరవించి ఆయనకు దేశంలోని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తే అక్కడ అసందర్భంగా ప్రవర్తించి పార్టీకి అప్రతిష్ట కలిగేలా  ప్రవర్తించారు. అంతేగాకుండా జగన్ నిర్ణయాలను కూడా వక్రీకరించి మాట్లాడారు. మాధవ్ వ్యవహరించిన తీరు సాటి వైకాపా నేతలనే విస్మయానికి గురిచేసింది అంటే… మాధవ్ ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది. కియాలో స్థానికేతరులకే అత్యధిక […]

ఆ ఎంపీపై జగన్ ఫైర్?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2019 | 2:00 AM

Share

కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ను గౌరవించి ఆయనకు దేశంలోని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తే అక్కడ అసందర్భంగా ప్రవర్తించి పార్టీకి అప్రతిష్ట కలిగేలా  ప్రవర్తించారు. అంతేగాకుండా జగన్ నిర్ణయాలను కూడా వక్రీకరించి మాట్లాడారు. మాధవ్ వ్యవహరించిన తీరు సాటి వైకాపా నేతలనే విస్మయానికి గురిచేసింది అంటే… మాధవ్ ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది.

కియాలో స్థానికేతరులకే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చారన్న మాట నిజమే అయినా దానిపై అంతర్జాతీయ మీడియా ముందు అసందర్భంగా వ్యక్తీకరించడం – ప్రభుత్వ ఉద్దేశాలు పారిశ్రామిక వేత్తలకు తప్పుగా అర్థమయ్యేలా మాధవ్ ప్రవర్తించిన తీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే… కొత్తగా పెట్టే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నది నిబంధన. ఇప్పటికే నెలకొల్పిన కంపెనీలు దశల వారీగా స్థానికులను ఎక్కువగా తీసుకోవాలనేది నిబంధన. దీనికి దాదాపు మూడేళ్ల సమయం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికిపుడు పాత వారిని తీసేసి కొత్తగా స్థానికులను తీసుకోవాలంటే… కంపెనీ అన్నిరకాలుగా నష్టపోతుంది. అందుకే ప్రభుత్వం నిర్ణీత గడువు ఇస్తూ నిబంధనలు రూపొందించింది.

కియా ప్రతినిధులతో గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికిపుడు స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులతో వ్యాఖ్యానించడం – శుభాకాంక్షలు చెప్పాల్సిన చోట నిరసన వ్యాఖ్యలు రాయడం – ప్రతిపక్షం విమర్శలు చేస్తే… ఉద్దేశాన్ని విపులంగా వివరించాల్సిన చోట ముఖ్యమంత్రి జగన్ కు చెప్పి కియా మెడలు వంచిస్తా… ఇంకా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు అని అనడం వైసీపీకి – రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. అందుకే ఈ విషయంలో ఎంపీ కి చీవాట్లు తప్పవని తెలుస్తోంది. తనను కలవాలని గోరంట్ల మాధవ్ కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన