కోడెల అంతిమ యాత్రలో బాబు, బాలయ్యల ‘విక్టరీ’ సింబల్.. నెటిజన్ల ఫైర్

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు బుధవారం నరసరావుపేటలోని స్వర్గపురిలో పూర్తయ్యాయి. ఆయన అంతిమ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణలతో పాటు భారీగా పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోడెలకు తుది వీడ్కోలు పలికారు. అయితే యాత్ర కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు రెండు, మూడు చోట్ల విక్టరీ సింబల్ చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో […]

కోడెల అంతిమ యాత్రలో బాబు, బాలయ్యల ‘విక్టరీ’ సింబల్.. నెటిజన్ల ఫైర్
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2019 | 1:13 PM

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు బుధవారం నరసరావుపేటలోని స్వర్గపురిలో పూర్తయ్యాయి. ఆయన అంతిమ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణలతో పాటు భారీగా పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోడెలకు తుది వీడ్కోలు పలికారు. అయితే యాత్ర కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు రెండు, మూడు చోట్ల విక్టరీ సింబల్ చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కోడెల అభిమానులతో పాటు ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు చంద్రబాబు తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతిమ యాత్రను కూడా పబ్లిసిటీగా మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు కోడెల అంతిమ యాత్ర సమయంలో.. ఆయన పార్థీవ దేహం ఉన్న వాహనంలోనే బాలయ్య ఉన్నారు. యాత్ర పూర్తయ్యే వరకు అందులోనే ఉన్నారు. అయితే మధ్య మధ్యలో ఆయన కూడా విక్టరీ సింబల్ చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన మరణంతో అందరూ విషాదంలో ఉంటే.. ఇదేం పద్దతి అంటూ విరుచుకుపడుతున్నారు.

https://twitter.com/TigerVenkat786/status/1174321488041631744?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1174321488041631744&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fandhra-pradesh%2Fnews%2Fnetizens-trolling-mla-bala-krishna-and-chandrababu-for-showing-victory-symbol-in-kodela-final-journey%2Farticleshow%2F71188621.cms