అందుకోసమే రాజధాని మార్పు.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Jan 23, 2020 | 1:37 PM

రాజధాని మార్పుకు బీజేపీకి సంబంధం లేదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ వెంట రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌తో పాటు పురందేశ్వరీ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి, హోంమంత్రి అనుమతితోనే అమరావతిని మారుస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తప్పుడు ప్రచారంచేస్తోందన్నారు. రాజధాని మార్పులో […]

అందుకోసమే రాజధాని మార్పు.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు
Follow us on

రాజధాని మార్పుకు బీజేపీకి సంబంధం లేదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ వెంట రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌తో పాటు పురందేశ్వరీ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి, హోంమంత్రి అనుమతితోనే అమరావతిని మారుస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తప్పుడు ప్రచారంచేస్తోందన్నారు. రాజధాని మార్పులో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్న పవన్.. వైసీపీ ప్రభుత్వం.. వారి భూదందా కోసమే రాజధానిని మారుస్తోందన్నారు. మూడు రాజధానుల అంశం తమ వద్దకు రాలేదని ఏపీ బీజేపీ కో-ఇంచార్జ్ సునీల్ దియోధర్ కూడా స్పష్టం చేశారన్నారు. ఇక అయిదు కోట్ల మంది రైతుల శ్రేయస్సు కోసం.. ఫిబ్రవరి 2న బీజేపీ-జనసేన సంయుక్తంగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.