AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు అనుభవం ఏంటో అర్ధమైందా… జగన్ సర్కార్‌కు ట్వీట్

మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య శక్తి ఎంతటిదో..చంద్రబాబుగారి అనుభవం ఏంటో అధికార పక్షానికి తెలిసొచ్చిందన్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును.. టీడీపీ విజయవంతంగా సెలెక్ట్‌ కమిటీ బాట పట్టించగలిగిందన్నారు. ఇది రాజధాని రైతుల ఆకాంక్ష అంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. […]

చంద్రబాబు అనుభవం ఏంటో అర్ధమైందా... జగన్ సర్కార్‌కు ట్వీట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 23, 2020 | 1:22 PM

Share

మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య శక్తి ఎంతటిదో..చంద్రబాబుగారి అనుభవం ఏంటో అధికార పక్షానికి తెలిసొచ్చిందన్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును.. టీడీపీ విజయవంతంగా సెలెక్ట్‌ కమిటీ బాట పట్టించగలిగిందన్నారు. ఇది రాజధాని రైతుల ఆకాంక్ష అంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మరోవైపు వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అటు అమరావతి రైతులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు బయటకు రాగానే..ఆయనకు శాలువాలు కప్పుతూ అభినందించి..కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు వెంట ర్యాలీ తీశారు. నారా లోకేష్‌, ఎమ్మెల్యే బాలకృష్ణను కార్యకర్తలు అభినందలతో ముంచెత్తారు. జై బాలయ్య.. జై లోకేష్‌ అంటూ నినాదాలు చేశారు. అటు రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున టపాసుల్ని కాల్చారు.