Andhra Pradesh: నిరసనలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి.. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు: ఏపీ జేఏసీ పిలుపు..

డిమాండ్ల సాధనలో భాగంగా నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది ఏపీ జేఏసీ అమరావతి. పని గంటలు ముగిసే వరకు మాత్రమే పని చేయాలని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

Andhra Pradesh: నిరసనలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి.. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు: ఏపీ జేఏసీ పిలుపు..
Ap Jac Amaravati

Updated on: Mar 22, 2023 | 6:30 AM

డిమాండ్ల సాధనలో భాగంగా నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది ఏపీ జేఏసీ అమరావతి. పని గంటలు ముగిసే వరకు మాత్రమే పని చేయాలని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. వచ్చే నెల ఐదో తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి వర్క్ టు రూల్ పాటించాలన్నారు. ప్రతీ ఒక్కరూ సంఘీభావం తెలిపితేనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆయన.. 11వ పీఆర్సీ ఎరియర్స్ చెల్లించలేదన్నారు. పీఆర్సీ ఎరియర్స్ డ్యూస్‌ను డ్రాన్ స్టేట్మెంట్‌లో ఎంట్రీ వేసి రిటైర్ అయ్యాక తీసుకోవాలన్న దానికి తాము ఒప్పుకోమన్నారు.

వొల్యూమ్ 3 షెడ్యూల్ 2 ప్రకారం క్యాడర్ వారి స్కేల్స్ రాత్రికి రాత్రి హడావుడిగా ఇచ్చారంటూ బొప్పరాజు మండిపడ్డారు. పీఆర్సీ రికమండేషన్‌లో 7 కాలమ్స్ ఉంటే అప్‌లోడ్ చేసిన దాంట్లో రెండు మాత్రమే ఉన్నాయి. దీని అర్థమేంటని ఆయన ప్రశ్నించారు.

పెరిగిన పే స్కేల్ చూపించలేదు, పాత అలవెన్స్‌ లే ఇప్పటికీ తీసుకుంటున్నాం, ఎవరు రాసిస్తే మా డబ్బులు మీరు డ్రా చేసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us