AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి మినహా అందరికీ ఇకపై రేషన్ షాప్‌ల ద్వారానే బియ్యం, సరుకుల పంపిణీ!

రేషన్ పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు బియ్యం, సరుకుల సరఫరా జరుగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ ద్వారా రేషన్ అందుతుందని ఆయన తెలిపారు.

Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి మినహా అందరికీ ఇకపై రేషన్ షాప్‌ల ద్వారానే బియ్యం, సరుకుల పంపిణీ!
Anand T
|

Updated on: May 20, 2025 | 7:47 PM

Share

మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ పంపిణీ వ్యవస్తలో మార్పులు తీసుకువచ్చింది. మంత్రివర్గ సమావేశం తర్వాత వీడియాకు వివరాలు వెల్లడించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఇక రేషన్ వ్యాన్‌లతో సరుకుల సరఫా ఉందని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీని నుంచి గతంలో మాదిరిగానే రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు బియ్యం, సరుకుల సరఫరా జరుగుతుందని ఆయన అన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ ద్వారా రేషన్ అందుతుందని తెలిపారు.

అయితే, 29 వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా సజావుగా జరిగేదని.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల పేరిట ఆ వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు. 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం రూ.1860 కోట్లు డబ్బు వృధా చేశారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానంతో రేషన్ లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేకపోయారని తెలిపారు. ఈ విధానం ద్వారా సుమారు 30 శాతం లబ్ధి దారులకు రేషన్ అందట్లేదని ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలో తేలిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ వాహనాలతో రేషన్ సరఫరా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జవాబుదారీతనం లేకుండా పోయిందని..సరుకులు ఎటు పోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి నెకలొందని ఆయన అన్నారు. ఈ వాహనాల బియ్యం అక్రమ రవాణాకు పాల్పడడంతో వారిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 29 వేల రేషన్ షాపుల ఉంటే.. కేవలం తొమ్మదివేల వాహనాలే ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. దొంగ లెక్కలు చూపి బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. అందుకే వీటికి చెక్‌ పెట్టే విధంగా ముందులాగే రేషన్ దుకాణాల ద్వారా సరుకులు సరఫరా చేసేందుకు నిర్ణయించామని తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సరుకులు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..