AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం..డిగ్రీ కోర్సులకు కొత్త సిలబస్

ఏపీలో సర్కార్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత మేరకు తగ్గించే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచే డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది.

ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం..డిగ్రీ కోర్సులకు కొత్త సిలబస్
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2020 | 7:25 PM

Share

ఏపీలో సర్కార్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత మేరకు తగ్గించే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచే డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది. డిగ్రీ కోర్సులను ఉద్యోగ ఆధారితంగా తీర్చిదిద్దుతూ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేసింది. విద్యాసంవత్సరం పది నెలల అప్రెంటీస్ ను తప్పనిసరి చేయడంతో పాటు సిలబస్ లోనూ పలు మార్పులు చేశారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నతవిద్యామండలి రూపొందించిన సిలబస్ ను విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా విడుదల చేశారు.

ప్రస్తుత కాలానికి అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఉద్యోగ ఆధారితంగా మార్చేందుకు వీలుగా భారీ మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగా సిలబస్ మార్పుతో పాటు కొత్తగా అప్రెంటిస్ షిప్ ను కూడా తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక డిగ్రీ సవ్యంగా పూర్తి చేస్తే ఏదో రకంగా ఉద్యోగం లభించినట్లే అన్న ధీమా కల్పించేలా ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక కాలేజీలను సమాజంతో అనుసంధానం చేసేందుకు కమ్మూనిటీ సేవల ప్రాజెక్టును ఇంటర్న్‌షిప్‌లో చేర్చారు. మొదటి ఏడాది పూర్తయిన వెంటనే ఇది ఉంటుంది.