వైఎస్సార్ జయంతి.. ఇకపై రైతు దినోత్సవం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఇకపై రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్సార్ జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ సోమవారం కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు చెందిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఇకపై రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్సార్ జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ సోమవారం కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు చెందిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండగలా నిర్వహించాలని సూచించారు. రైతులకు ప్రభుత్వ రాయితీలు, పెట్టుబడి రాయితీ, పంటల బీమా తదితర సంక్షేమ పథకాల ఫలాలు పక్కాగా అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ నొక్కి చెప్పారు.