AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్యాయాలను సరిద్దిదండి: జగన్‌కు కన్నా ఏడు లేఖలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏడు లేఖలు రాశారు. ఆ లేఖల్లో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అందులో ముఖ్యంగా రాజధాని భూముల అక్రమాలు.. అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలని మరో లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు పోలవరం నిర్వాసితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని ఇంకో లేఖలో పేర్కొన్నారు. […]

అన్యాయాలను సరిద్దిదండి: జగన్‌కు కన్నా ఏడు లేఖలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 12:28 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏడు లేఖలు రాశారు. ఆ లేఖల్లో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అందులో ముఖ్యంగా రాజధాని భూముల అక్రమాలు.. అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలని మరో లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు పోలవరం నిర్వాసితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని ఇంకో లేఖలో పేర్కొన్నారు. మరో లేఖలో చుక్కల భూముల సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఇక కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన.. హిందూ దేవాలయాలను పునర్నిర్మించాలని ఇంకో లేఖలో కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.