AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుళ్లూరులో రైతుల సమావేశం.. చంద్రబాబుపై ఫైర్!

విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తుళ్లూరులో రైతులు ప్రజా సంఘాలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నైర్వహించింది వైసీపీ. ప్రజా రాజధాని అమరావతి అని టీడీపీ పేరు పెడితే అందులో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణమంటూ వైసీపీ  ఆరోపించింది. రాజధాని పేరుతొ టీడీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు వైసీపీ నేత, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో రాజధానిని నిర్మించాలని టీడీపీ చాకచక్యంగా ప్లాన్ చేసిందని, ఎన్నో రకాలుగా భూసేకరణ చేసి రైతుల […]

తుళ్లూరులో రైతుల సమావేశం.. చంద్రబాబుపై ఫైర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 05, 2019 | 6:17 PM

Share

విజయవాడలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తుళ్లూరులో రైతులు ప్రజా సంఘాలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నైర్వహించింది వైసీపీ. ప్రజా రాజధాని అమరావతి అని టీడీపీ పేరు పెడితే అందులో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణమంటూ వైసీపీ  ఆరోపించింది. రాజధాని పేరుతొ టీడీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు వైసీపీ నేత, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో రాజధానిని నిర్మించాలని టీడీపీ చాకచక్యంగా ప్లాన్ చేసిందని, ఎన్నో రకాలుగా భూసేకరణ చేసి రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారని బుగ్గన ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేయడానికి కుట్ర పన్నారని, మాయమాటలు చెప్పి మోసం చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. అమరావతి ప్రాంత రైతులు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. తమపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారని వారు వాపోయారు.