Andhra Pradesh: చెన్నైకి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Andhra Pradesh: చెన్నైకి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
Road Accident

Updated on: May 25, 2023 | 10:02 AM

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మనుబోలు మండలం బద్దెవోలు అడ్డరోడ్డు సమీపంలో అగి ఉన్న లారీని ఇనోవా కారు ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు.

క్షతగాత్రులను గూడూరు ఆసుప్రత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోడవనూరు మండలం దమరిగుంట నుంచి చెన్నైకి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us