Turkey Earthquake: టర్కీలో 5.6 తీవ్రతతో మళ్లీ భూకంపం.. పూర్తిగా కుప్పకూలిన డ్యామేజ్డ్‌ బిల్డింగ్స్‌..

|

Feb 27, 2023 | 9:18 PM

టర్కీలో భూకంపం కారణంగా చాలా విధ్వంసం సంభవించింది. హటే ప్రావిన్స్‌లోని అంటక్యా నగరంలో స్మశానవాటికలో స్థలం కొరత ఏర్పడింది. ఈ ఘోర దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు టర్కీ ప్రభుత్వం మారుమూల ప్రాంతంలో సామూహిక సమాధులను నిర్మించింది.

Turkey Earthquake: టర్కీలో 5.6 తీవ్రతతో మళ్లీ భూకంపం.. పూర్తిగా కుప్పకూలిన డ్యామేజ్డ్‌ బిల్డింగ్స్‌..
Earthquake1
Follow us on

మూడు వారాల క్రితం భారీ భూకంపాలతో వణికిపోయిన టర్కీని తాజాగా మరో భూకంపం కలవరపెట్టింది. పశ్చిమ ఆసియా దేశమైన టర్కీలో మరోసారి బలమైన భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం (ఫిబ్రవరి 27) సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అనేక భవనాలు నేలకూలాయి. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 69 మందికి గాయాలయ్యాయి. టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. క్షతగాత్రులను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.

ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం భయంకరమైన వినాశనాన్ని కలిగించిందని తెలిసిందే. భూకంపం కారణంగా ఈ రెండు దేశాల్లో 47 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంప కార్యకలాపాలను కొలిచే ఏజెన్సీల ప్రకారం, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 7 వేలకు పైగా అనంతర ప్రకంపనలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున కూడా 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది, ఇందులో 8 మంది మరణించారు. 300 మంది గాయపడ్డారు. అదే సమయంలో, ఫిబ్రవరి 6 భూకంపం కారణంగా బలహీనపడిన డజన్ల కొద్దీ భవనాలు ఇటీవలి ప్రకంపనలకు కూలిపోయాయి.

టర్కీలో భూకంపం కారణంగా చాలా విధ్వంసం సంభవించింది. హటే ప్రావిన్స్‌లోని అంటక్యా నగరంలో స్మశానవాటికలో స్థలం కొరత ఏర్పడింది. ఈ ఘోర దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు టర్కీ ప్రభుత్వం మారుమూల ప్రాంతంలో సామూహిక సమాధులను నిర్మించింది. ఇంకా చాలా మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందని, వాటి డీఎన్‌ఏ శాంపిల్స్‌ను ఉంచుతున్నారు. ఆ తర్వాత ఇతర ప్రక్రియ పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇండోనేషియాలోనూ తీవ్ర భూకంపం సంభవించగా..
సోమవారం ఇండోనేషియాలోనూ తీవ్ర భూకంపం సంభవించింది. ఇక్కడ కేవలం 1 గంట వ్యవధిలో 5 సార్లు భూకంపాలు వచ్చాయి. అయినప్పటికీ, వాటి తీవ్రత 3.1 నుండి 4.5 వరకు ఉంటుంది. రిక్టర్ స్కేలుపై పెను భూకంపం తీవ్రత 5.5గా ఉందని, దీని కేంద్రం భూమి లోపల 12 కిలోమీటర్ల దూరంలో ఉందని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..