
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫట్టా అల్-సిసితో కలిసి షర్మ్ ఎల్-షేక్లో గాజా శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారతదేశం చాలా గొప్ప దేశమని.. భారత్తో తనకు చాలా మంచి స్నేహితుడు ఉన్నాడని ఆయన చాలా అద్బుతమైన పిచేశాని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. అలాగే భారత్-పాక్ శాంతి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారతదేశం, పాకిస్తాన్ “చాలా చక్కగా కలిసి జీవిస్తాయి” అని అన్నారు.
#WATCH | Egypt | US President Donald Trump says, “India is a great country with a very good friend of mine at the top and he has done a fantastic job. I think that Pakistan and India are going to live very nicely together…”
(Video source: The White House/YouTube) pic.twitter.com/rROPW57GCO
— ANI (@ANI) October 13, 2025
భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక రాయబారిగా హాజరయ్యారు. గాజాలో శాంతి కార్యక్రమాలు, మానవతా సహాయం కోసం భారత్ మద్దతు గురించి చర్చించడానికి సింగ్ అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ను అధికారికంగా కలిసిన తొలి భారత విదేశాంగ సహాయ మంత్రిగా ఆయన నిలిచారు.
గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అచంచలమైన శాంతి ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు . X లో ఒక పోస్ట్లో, రెండు సంవత్సరాలకు పైగా హమాస్ బందీలుగా ఉండి, ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక మొదటి దశలో భాగంగా ఈరోజు ఉదయం విడుదలై, చివరకు ఇజ్రాయెల్కు తిరిగి వచ్చిన చివరి 20 మంది బందీల తిరిగి రావడాన్ని కూడా ప్రధానమంత్రి స్వాగతించారు.
We welcome the release of all hostages after over two years of captivity. Their freedom stands as a tribute to the courage of their families, the unwavering peace efforts of President Trump and the strong resolve of Prime Minister Netanyahu. We support President Trump’s sincere…
— Narendra Modi (@narendramodi) October 13, 2025