AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఎఫెక్ట్ : ఆ దేశంలో న్యూఇయ‌ర్ వేడుక‌లు నిషేధం.. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టంతో మ‌రిన్ని ఆంక్ష‌లు

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌తంలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించిన దేశాలు..ఇప్పుడు అన్‌లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మ‌రో వైపు క‌రోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి..

క‌రోనా ఎఫెక్ట్ : ఆ దేశంలో న్యూఇయ‌ర్ వేడుక‌లు నిషేధం.. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టంతో మ‌రిన్ని ఆంక్ష‌లు
Anil kumar poka
|

Updated on: Dec 16, 2020 | 11:41 AM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌తంలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించిన దేశాలు..ఇప్పుడు అన్‌లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మ‌రో వైపు క‌రోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఒక వైపు క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టి అన్‌లాక్‌లో ఉంటే.. జ‌ర్మ‌నీ దేశం మాత్రం లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం డిసెంబ‌ర్ 16 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఎంజెలా మెర్కెలా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దేశంలో కొత్త సంవత్స‌రం వేడుక‌ల‌పై కూడా నిషేధం విధించింది అక్క‌డి మంత్రిత్వ‌శాఖ‌. అంతేకాకుండా క్రిస్మ‌స్ పండ‌గ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో ప‌లు ఆంక్ష‌లు విధించింది.

ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, ఇత‌ర కేంద్రాలు సైతం న‌వంబ‌ర్ నుంచి మూత‌ప‌డ్డాయి. చాలా కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను ఇంటి నుంచే ప‌ని చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. జ‌ర్మ‌నీలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో కోవిడ్ ప్ర‌భావం న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ప‌డింది. ఇక క్రిస్మ‌స్ పండ‌గ సంద‌ర్భంగా కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే ఒక చోట చేర‌డానికి అనుమ‌తి ఇచ్చింది. భౌతిక దూరం, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్ వ‌స్తుండ‌టంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే మిగ‌తా యూర‌ప్ దేశాల‌తో పోలిస్తే క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో జ‌ర్మ‌నీ మెరుగ్గానే ఉంది.

ఈ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ప‌రిస్థితి దారుణంగా మారే అవ‌కాశం ఉంద‌ని జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఎంజెలా మెర్కెలా అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే జ‌ర్మ‌నీలో ఇప్ప‌టి వ‌ర‌కు 13 ల‌క్ష‌లకుపైగా మంది క‌రోనా బారిన ప‌డ‌గా, 22 వేల మంది మృతి చెందారు. ప్ర‌తి రోజు కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం, అందులో క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ వ‌స్తుండ‌టంతో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..