
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ISI సెల్ ఓపెన్ అయింది. పాకిస్తాన్లో ఉండాల్సిన అక్కడి ఆర్మీ మేజర్స్, కల్నల్స్, బ్రిగేడియర్స్… ఇవాళ ఢాకాలో తిష్ఠవేశారు. ఏం పని వాళ్లకి? మొన్న నవంబర్లో కొలంబోలో జరిగిన మీటింగ్ అజిత్ ధోవల్ ఈ విషయమే అడిగారు. ఢాకాలో ISI సెల్ పెట్టడమేంటని. పిచ్చి సమాధానం చెప్పి ఊరుకుంది బంగ్లాదేశ్. బట్.. భారత్కు విషయమేంటో అర్ధమైంది. విచిత్రమేంటో గానీ.. భారత్పై విషం చిమ్ముతున్న వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోయారు. ఒకరిద్దరు చనిపోతే యాధృచ్చికం. బై యాక్సిడెంట్ చనిపోతే కాకతాళీయం. కాని, 40 మంది చనిపోతే…! వారం క్రితం ఉస్మాన్ హాదీని చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హాదీ చనిపోయాకే హిందువులపై దాడులు జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి అనుకుంటారు. కాదు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరగని జిల్లా అంటూ లేదు. హిందూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు లెక్కే లేదు. అలా చేస్తున్నందుకే 40 మంది చనిపోయారు. కాకపోతే హాదీ మరణంతో హిందువులపై దాడులు ఈ ప్రపంచానికి తెలిసిందంతే. బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయ్. కాదేమో.. ఈ స్టేట్మెంట్ను ఇలా ఇవ్వకూడదేమో. హిందువులే టార్గెట్గా బంగ్లాదేశ్లో మూక దాడులు జరుగుతున్నాయ్ అనాలేమో. ఇందాక వచ్చిన క్వశ్చనే. హిందువులనే ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే.. పాకిస్తాన్ హస్తం ఉందా? చైనా వెనకుండి నడిపిస్తోందా? ఊరికే అనుమానాలు వ్యక్తం చేస్తే ఎలా? ఏదో ఒక ప్రూఫ్ ఉండాలిగా. ఇదిగో ప్రూఫ్.. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ మంత్రులంతా ఒకచోట చేరి.. మీటింగ్...