PM Modi: ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు.. ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు.. ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రధాని మోదీ..

|

Jul 14, 2023 | 6:44 AM

Unified Payments Interface: దేశంలో 2016 నాటి నుంచి యూపీఐ సేవల వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డిజిటల్ ట్రాన్సక్షన్స్‌ని కేవలం భారత్‌కి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం..

PM Modi: ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు.. ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు.. ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రధాని మోదీ..
French president Emmanuel Macron and PM Modi
Follow us on

Unified Payments Interface: దేశంలో 2016 నాటి నుంచి యూపీఐ సేవల వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డిజిటల్ ట్రాన్సక్షన్స్‌ని కేవలం భారత్‌కి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇంకా ఈ విధానమైన లావాదేవీలు ఎంతో సులభంగా, సురక్షితంగా ఉండటంతో ప్రపంచ దేశాలు సైతం యూపీఐ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ లిస్టులో తాజాగా యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ కూడా చేరింది. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం ఆ దేశానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో ఆయన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

వారితో ప్రధాని మోదీ.. త్వరలో ఫ్రాన్స్‌లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం కానున్నాయని, ఈ విధమైన చెల్లింపుల కోసం ఇరు దేశాలు అంగీకరించ్చాయని, పారీస్ పర్యటనకు వచ్చిన భారతీయ పర్యాటకులు ఇకపై ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..