AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mexico Shooting: మెక్సికోలో మారణహోమం.. 19 మందిని చంపిన దుండగులు..

Mexico Shooting: మెక్సికోలో కోడి పందాల స్థావరంలో మారణహోమం చోటుచేసుకుంది. గ్యాంగ్‌వార్‌తో ఆ బరి మరు భూమిగా మారింది. దీంతో కోడి పందాల్లో

Mexico Shooting: మెక్సికోలో మారణహోమం.. 19 మందిని చంపిన దుండగులు..
Mexico Shooting
Shaik Madar Saheb
|

Updated on: Mar 28, 2022 | 11:04 PM

Share

Mexico Shooting: మెక్సికోలో కోడి పందాల స్థావరంలో మారణహోమం చోటుచేసుకుంది. గ్యాంగ్‌వార్‌తో ఆ బరి మరు భూమిగా మారింది. దీంతో కోడి పందాల్లో మనుషుల రక్తం ఏరులై పారింది. సెంట్రల్ మెక్సికోలోని లాస్‌ టినాజస్‌ అనే పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు స్టేట్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం (FGE) వెల్లడించింది. మెక్సికో మిచోవాకాన్ రాష్ట్రంలో గుట్టుగా నిర్వహిస్తున్న కోడి పందాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలాకాలంగా అక్కడ పోలీసుల కన్నుగప్పి కోడి పందాలు, భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. చుట్టుపక్కల పందాలరాయుళ్లు అక్కడికి వస్తున్నారు. సీక్రెట్‌గా కోడి పందాలు, బెట్టింగ్‌లు జరిగిపోతున్నాయి. అక్కడ ఏం గొడవైందో తెలియదు కానీ మారణహోమంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

అరుపులు కేకలతో గోలగోలగా ఉండే ఆ పందాల చోటులో తూటాలు పేలాయి. కొందరు వ్యక్తులు విచాక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. కాల్పులు జరిపింది ఎవరు? కారణమేంటి? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మెక్సికోలో ఈ ప్రాంతం అరాచకాలకు చిరునామాగా ఉంది. లా అండ్‌ ఆర్డర్‌ లేదు. డ్రగ్‌ రూట్స్‌పై కంట్రోల్‌ కోసం గ్యాంగ్‌ల మధ్య వార్‌ జరుగుతోంది. రైతులను బెదిరించి డబ్బు వసూలు చేయడం కూడా గ్యాంగ్‌ల నిత్యకృత్యంగా ఉంది. గ్యాంగ్‌ వారే ఈ మారణహోమానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతన్నాయి.

Also Read:

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో..

Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్