అమెరికాలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. దుండుగుల కాల్పుల్లో ఏలూరి వాసి మృతి..

|

Apr 21, 2023 | 6:00 AM

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడి దుర్మరణం చెందాడు. వెస్ట్‌ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 లకు జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి సాయిష్ వీర ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్‌,1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌..

అమెరికాలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. దుండుగుల కాల్పుల్లో ఏలూరి వాసి మృతి..
Gun Fire
Follow us on

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడి దుర్మరణం చెందాడు. వెస్ట్‌ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 లకు జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి సాయిష్ వీర ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్‌,1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌ పనిచేస్తున్న వీర.. దోపిడీకి ప్రయత్నించిన దొంగను అడ్డుకున్నాడు. దాంతో రెచ్చిపోయిన దుండగులు.. సాయిష్ వీరపై కాల్పులు జరిపారు. ఆ కాల్పు్ల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అనుమానితుడి ఫోటోలను విడుదల కొలంబస్‌ పోలీసులు. ఈ సంవత్సరం కొలంబస్‌లో ఇది 50వ హత్య.

తీవ్ర విషాదం..

24 ఏళ్ళ సాయిష్ వీర .. మరో రెండు వారాల్లో ఉద్యోగం మానేయాలనుకున్నాడు. కానీ, ఇంతలోనే ఈ అనుకోని ఘటన జరగడం.. అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిష్ వీరా.. కొలంబస్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. H1 B వీసా కూడా తీసుకున్నాడు. అందరికి అడగ్గానే హెల్ప్ చేసే వాడనీ.. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని.. అతని ఫ్రెండ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..