AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. అక్కడ అసలేం జరుగుతోంది.. ఒత్తిడితో ఐదుగురు AI శాస్త్రవేత్తల మరణం..

అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.. టెక్ యుద్ధం.. సుంకాల పోరు రోజు రోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.. ఈ క్రమంలో ఓ సంచలన విషయం ఆందోళనకు గురిచేసింది.. అమెరికాతో కొనసాగుతున్న టెక్ యుద్ధం మధ్య పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ఐదుగురు చైనా AI శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు సమాచారం.. శాస్త్రవేత్తల వయస్సు 38 -55 సంవత్సరాల మధ్య ఉంటుందని నివేదిక పేర్కొంది.

వామ్మో.. అక్కడ అసలేం జరుగుతోంది.. ఒత్తిడితో ఐదుగురు AI శాస్త్రవేత్తల మరణం..
Artificial Intelligence
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2025 | 7:38 AM

Share

అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.. టెక్ యుద్ధం.. సుంకాల పోరు రోజు రోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.. ఈ క్రమంలోనే ఓ ఘటన సంచలనంగా మారింది. AI రంగంలో చైనా, అమెరికా మధ్య సాంకేతిక యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పని ఒత్తిడి కారణంగా ఐదుగురు చైనా AI శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఒక చైనీస్ మీడియా వెల్లడించినట్లు తెలుస్తోంది.. ఈ వార్త నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం, చైనా కృత్రిమ (AI) మేధస్సు రంగంలో ‘డీప్‌సీక్’ తో వార్తల్లో నిలిచింది.. దాని తక్కువ ఖర్చుతో కూడిన మోడల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, ‘డీప్‌సీక్’ ఆపిల్ యాప్ స్టోర్‌లో చాట్ GPTని కూడా అధిగమించింది.

కానీ చైనా మీడియాలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వేగంగా..అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు రంగంలో చైనా ప్రతిభకు కొరత లేనప్పటికీ, అక్కడ అనేక విజయగాథలు వ్రాయబడుతూ చరిత్ర స‌ృష్టిస్తున్నప్పటికీ..ఇటీవలి సంవత్సరాలలో ఈ రంగంతో సంబంధం ఉన్న కొంతమంది అగ్రశ్రేణి వ్యక్తులను దేశం కోల్పోయిందని పేర్కొంది.

ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఐదుగురు అగ్రశ్రేణి AI శాస్త్రవేత్తలు అకాల మరణాలు వారి వ్యక్తిగత భద్రతతో పాటు ఒత్తిడితో కూడిన పరిశోధన వాతావరణం గురించి ఆందోళనలను రేకెత్తిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుని, పని కోసం చైనాకు తిరిగి వచ్చినవారేనని నివేదిక వెల్లడించింది.

చైనీస్ కంప్యూటర్ శాస్త్రవేత్త లియు షావోషన్ మాట్లాడుతూ.. AI పరిశోధకులు అధిక జీతాలు సంపాదిస్తున్నప్పటికీ, వారు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీని వల్ల తీవ్రమైన పోటీ ఉంటుందని ఆయన వివరించారు.

2022 – 2025 మధ్య ప్రాణాలు కోల్పోయిన AI శాస్త్రవేత్తల జాబితాను కూడా ఈ నివేదిక ప్రచురించింది. వారి వయస్సు 38 -55 సంవత్సరాల మధ్య ఉంది. అటువంటి పరిస్థితిలో, ఈ అకాల మరణాలు పోటీ ఒత్తిడితో ముడిపడి ఉన్నాయని నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా