బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రి కుమార్తె జైమా రెహమాన్పై దాడి.. ఎందుకు జరిగింది?
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో మరోసారి బంగ్లాదేశ్లో వివాదం చెలరేగింది. కొత్త ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ కుమార్తె జైమా రెహమాన్ను కించపరిచేలా ఈ వీడియో వ్యాప్తి చేసినట్లు చాలామంది భావిస్తున్నారు. అయితే, ఈ వీడియో నిజమా లేక నకిలీదా అనేది ఇంకా నిర్ధారించలేదు.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో మరోసారి బంగ్లాదేశ్లో వివాదం చెలరేగింది. కొత్త ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ కుమార్తె జైమా రెహమాన్ను కించపరిచేలా ఈ వీడియో వ్యాప్తి చేసినట్లు చాలామంది భావిస్తున్నారు. అయితే, ఈ వీడియో నిజమా లేక నకిలీదా అనేది ఇంకా నిర్ధారించలేదు.
తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో, ఆయన కూతురు జైమాను పోలిన ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ, పాడుతూ, స్నేహితులతో చాట్ చేస్తూ కనిపించింది. జైమా లండన్లో ఉన్నప్పుడు ఈ వీడియో తీసి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ అధికారిక ధృవీకరణ ఇంకా లేదు. ఈ వీడియోను అనేక నకిలీ ఫేస్బుక్ పేజీలు షేర్ చేశాయి. వాటితో పాటు ఆమె వ్యక్తిగత జీవితం గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.
బంగ్లాదేశ్లో ఇది మొదటి సంఘటన కాదు. మాజీ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్ కుమార్తె, ఒపెరా గాయని మోనికా యూనస్, మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా మనవరాలు అమ్రిన్ ఖండకర్ సెమాంటి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్, సైబర్ బెదిరింపులను ఎదుర్కొన్నారు. వారిద్దరూ రాజకీయాల్లో చురుకుగా లేరు. అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితాలు సోషల్ మీడియాలో బహిర్గతమయ్యాయి. దీనిపై BRC ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్లో సీనియర్ ఫెలో అయిన మహిన్ సుల్తాన్ మాట్లాడుతూ, ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ఆమె స్నేహితులతో లేదా పార్టీలతో సమయం గడుపుతుంటే, అది ఆమె వ్యక్తిగత విషయం. దానిని ఒక సమస్యగా మార్చకూడదని అన్నారు.
పితృస్వామ్య సమాజంలో, ఒక మహిళ ప్రజా జీవితంలో తనను తాను స్థిరపరచుకున్నప్పుడు, కొంతమంది ఆమెను కించపరచడానికి ప్రయత్నిస్తారు. మహిళల దుస్తులు, ప్రవర్తన, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వారిని కించపరచడం సర్వసాధారణం. జైమా రెహమాన్ విషయంలో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఇలాంటి చర్యలను చాలా మంది విమర్శించారు. మహిళలపై ఆన్లైన్ వేధింపులను నివారించడానికి కఠినమైన చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జైమా రెహమాన్ ఎవరు..?
జైమా రెహమాన్ తారిఖ్ రెహమాన్ ఏకైక కుమార్తె. ఆమె బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ల మనవరాలు. జైమా రెహమాన్ లండన్ లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు. తరువాత 2019 లో లింకన్స్ ఇన్ నుండి బార్-ఎట్-లా సర్టిఫికేషన్ పొందారు. రెహమాన్ లండన్ లో నివసించే న్యాయవాది. 2008లో తన తండ్రి అరెస్టు అయ్యి బెయిల్ పై విడుదలైన తర్వాత లండన్ కు వెళ్లడానికి ముందు జైమా రెహమాన్ ఢాకా కంటోన్మెంట్ లోని తన అమ్మమ్మ నివాసంలో పెరిగారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
