AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Blocks WHO Team: డ్రాగన్ కంట్రీ కంత్రీపనులకు వంతపాడిన WHO చైర్మన్ తొలిసారిగా చైనా తీరుపై మండిపాటు

ఇన్నాళ్లు కరోనా పుట్టుకకి కారణం ఎవరైనా ఏ దేశమైనా తెలుసుకోవచ్చు అన్న చైనా ప్రభుత్వం.. who బృందానికి అనుమతుల జాప్యం.. డ్రాగన్ పాలకులపై తొలిసారిగా అసహనం..

China Blocks WHO Team: డ్రాగన్ కంట్రీ కంత్రీపనులకు వంతపాడిన WHO చైర్మన్ తొలిసారిగా చైనా  తీరుపై మండిపాటు
Surya Kala
|

Updated on: Jan 06, 2021 | 3:39 PM

Share

China Blocks WHO Team: ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి రక్కసి కోరల్లో చిక్కుకుని అల్లలాడడానికి ప్రధాన కారణం కారణం చైనా అయితే.. ఆ వైరస్ గురించి దాని తీవ్రత గురించి సరైన అంచనా వేయకుండా డ్రాగన్ కంట్రీకి వంత పాడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటూ అమెరికా తీవ్ర స్థాయిలో విమర్శించింది. అగ్రరాజ్యంతో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు కూడా చైనా తీరుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశాయి. అయితే ఆ దేశాల ఆరోపణలు అవాస్తవాలు అంటూ చైనా కూడా కోవిడ్ 19 బాధిత దేశమే అంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్ అధానోమ్. అయితే తాజాగా డ్రాగన్ పాలకుల తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసహనం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధనకు సిద్ధమైన సంస్థ సభ్యులకు చైనాలోకి ప్రవేశించేందుకు అనుమతినివ్వడానికి అక్కడ పాలకులు జాప్యం చేస్తున్నారు. ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి నిపుణులు పుట్టుకపై ఎవరు పరిశోధనకోసం ఇప్పటికే చైనాకు బయలుదేరారని తెలిపారు. వారిలో ఏ ఒక్కరికీ చైనా ఇంత వరకు అనుమతులు జారీ చేయలేదని చెప్పారు.

డబ్ల్యూహెచ్‌వో, చైనా ప్రభుత్వం కలిసే నిపుణుల బృంద పర్యటనకు ఏర్పాట్లు చేసినా ఇప్పటి వరకూ బృందం సభ్యులకు తమ దేశంలో అడుగుపెట్టడానికి ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు టెడ్రోస్. చైనా ప్రభుత్వం తీరు తనను ఎంతో నిరాశకు గురి చేసిందని… అక్కడికి బయలు దేరిన బృందంలోని సభ్యుల్లో ఇద్దరు తిరిగి తమ స్వ గృహాలకు బయలు దేరారని… నిపుణులు తమ దేశంలో ప్రవేశించడానికి ఇప్పటికీ చైనా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. అసలు ఏర్పాట్ల మాటే మరిచారని ఘాటు వాఖ్యానించారు WHO చైర్మన్.

ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నట్లు కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టింది కాదని.. దాని పుట్టుకపై ఎవరు పరిశోధన చేస్తామన్నా తాను అంగీకరిస్తామని.. అలా పరిశోధన జరిపేందుకు WHO బృందానికి అనుమతులు ఇస్తామని గతంలో డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది. తాము కోవిడ్ విషయంలో నిర్దోషులమంటూ పలుమార్లు అక్కడ అధికారులు ప్రకటించారు.. ఈ నేపథ్యంలో నిపుణుల బృందంతో చైనా పాలకులు ప్రవర్తిస్తున్న వివాదాస్పద తీరును చైనాను ఇన్నాళ్లు సమర్ధించిన టెడ్రోస్ అధానోమ్ సహా అందరు తప్పు పడుతున్నారు. ఇప్పటికే “తాను చైనా ప్రభుత్వంలో మాట్లాడానని.. ఈ పర్యటన డబ్ల్యూహెచ్‌వోతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఎంతో కీలకం అని తెలిపాననిని” టెడ్రోస్‌ వెల్లడించారు. త్వరలోనే దీనికి అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని.. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ