డివైడర్ను ఢీకొట్టిన బస్సు.. 10 మంది మృతి
లిమా: పెరూ రాజధాని లిమా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. నార్త్వెస్ట్ పెరూ నుంచి రాజధానికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బస్సు పైభాగంలో కూర్చున్న ప్రయాణికులు రాళ్లపై పడి మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లిమా: పెరూ రాజధాని లిమా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. నార్త్వెస్ట్ పెరూ నుంచి రాజధానికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బస్సు పైభాగంలో కూర్చున్న ప్రయాణికులు రాళ్లపై పడి మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.