AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains: ఆఫ్ఘనిస్తాన్‌లో వర్షం, వరదల బీభత్సం.. 31 మంది మృతి.. 100 మంది గల్లంతు..

ఆఫ్ఘనిస్థాన్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో చాలామంది మరణించగా, తప్పినపోయిన వారి సంఖ్య లెక్కేలేదు.

Heavy Rains: ఆఫ్ఘనిస్తాన్‌లో వర్షం, వరదల బీభత్సం.. 31 మంది మృతి.. 100 మంది గల్లంతు..
Afghanistan Heavy Rains
Venkata Chari
|

Updated on: Aug 16, 2022 | 4:00 AM

Share

ఆఫ్ఘనిస్థాన్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో కనీసం 31 మంది మరణించారు. వందలాది మంది తప్పిపోయారు. ఈ మేరకు తాలిబన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. సోమవారం కనీసం 100 మంది అదృశ్యమయ్యారని నివేదిక పేర్కొంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ‘బఖ్తర్’ వార్తా సంస్థ ప్రకారం, ఆదివారం ఉత్తర పర్వాన్ ప్రావిన్స్‌లో వరదలు సంభవించాయి. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. 17 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

పర్వాన్ ప్రావిన్స్‌లోని మూడు ప్రభావిత జిల్లాల్లో వరదల కారణంగా బనీలో డజన్ల కొద్దీ ఇళ్లు కొట్టుకుపోయాయి. స్థానిక వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇతర 34 ప్రావిన్సులలో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశేషమేమిటంటే, దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా, జులై, జూన్లలో వరుసగా 40, 19 మంది మరణించారు.

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మునుపటిలాగా ఉందని, ఇప్పుడు భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజల జీవనం మరింత కష్టతరంగా మారిందని మీకు తెలియజేద్దాం. ప్రజలు తినడానికి ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ల పాలన తర్వాత ఇక్కడి ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాథమికంగా పూర్తిగా మారిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని ఏడాది పూర్తయింది. ఒక సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మార్పులు వచ్చాయి.

ఆర్థిక మందగమనం కారణంగా లక్షలాది మంది ఆఫ్ఘన్ పౌరులు పేదరికంలోకి నెట్టబడ్డారు. కాగా, తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రాడికల్స్ ప్రాబల్యం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. బాలికలు, మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలను అందించడంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే దేశం మొదట్లో దీనికి విరుద్ధంగా హామీ ఇచ్చింది. ఏడాది గడిచినా బాలికలను బడికి వెళ్లనివ్వకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తల నుంచి కాళ్ల వరకు కప్పుకోవాల్సి వస్తోంది.