బీరుట్ పేలుడుకు అదే కారణమా..?

భారీ పేలుళ్ల ధాటికి కకావికలమైన అందాల లెబనాన్‌ నగరం.. ఎక్కడ చూసినా కూలిన భవనాలు.. విరిగిపోయిన తలుపులు.. పగిలిపోయిన అద్దాలే కనిపిస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని నగరం బీరుట్‌ నౌకాశ్రయంలో జరిగిన భారీ పేలుడుతో వందలాది మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాదాపు 3 లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆసుపత్రుల వద్ద చికిత్స కోసం బారులు తీరారు. ఇప్పటికే కోవిడ్‌ వ్యాపించడంతో.. ఈ పేలుడు బాధితులకు పడకలు కరవైపోయాయి.

బీరుట్ పేలుడుకు అదే కారణమా..?
Follow us

|

Updated on: Aug 06, 2020 | 4:40 PM

భారీ పేలుళ్ల ధాటికి కకావికలమైన అందాల లెబనాన్‌ నగరం.. ఎక్కడ చూసినా కూలిన భవనాలు.. విరిగిపోయిన తలుపులు.. పగిలిపోయిన అద్దాలే కనిపిస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని నగరం బీరుట్‌ నౌకాశ్రయంలో జరిగిన భారీ పేలుడుతో వందలాది మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాదాపు 3 లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆసుపత్రుల వద్ద చికిత్స కోసం బారులు తీరారు. ఇప్పటికే కోవిడ్‌ వ్యాపించడంతో.. ఈ పేలుడు బాధితులకు పడకలు కరవైపోయాయి.

ఇప్పటి విపత్కర పరిస్థితికి కారణం రష్యాకు చెందిన ఒక షిప్. ప్రమాదకరమైన అమ్మోనియం నైట్రేట్ సరుకుతో బీరుట్ నౌకాశ్రయంలో కొన్నేళ్లుగా చిక్కుకుంది. అమ్మోనియం నైట్రేట్‌ పేలుడు పదార్థం కావడంతో దాని రవాణాకు అనుమతులు.. పత్రాలు తప్పనిసరి. సైప్రస్‌లో నివసించే రష్యా వ్యాపారవేత్త ఆధీనంలోని ఎం.వి. రోహ్‌సస్‌ అనే నౌక జార్జియా నుంచి మోజాంబిక్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో బీరుట్‌ సమీపంలో నౌక ఇంజిన్‌ చెడిపోయింది. దీంతో బలవంతంగా దాన్ని బీరుట్‌ నౌకాశ్రయానికి చేర్చారు. అయితే, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండానే నిషేధిత ఈ నౌక బీరుట్ తీరానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సిబ్బందిలో నలుగురు ఉక్రెయిన్‌కు, ఒకరు రష్యాకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివిధ రకాల వివాదాల తర్వాత వారిని విడుదల చేశారు. కొన్నాళ్లకే నౌక యజమాని దివాలా తీయడంతో నౌకను బీరుట్‌ పోర్టులో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నౌకపై న్యాయ వివాదాలు మొదలు కావడంతో అందులోనే ఏళ్లపాటు 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ఉంచడం అతి అత్యంత ప్రమాదకరమని భావించి దానిని పోర్టులోని హ్యాంగర్‌ 12లో భద్రపర్చారు. ఆ తర్వాత 2018లో అమ్మోనియం నైట్రేట్‌ను వదిలేసి షిప్‌ పోర్టు నుంచి అదృశ్యమైపోయింది.

ఈ నౌకలో పట్టుకొన్న అమ్మోనియం నైట్రేట్‌ బ్రెజిల్‌లోని ఆర్కాస్‌ నైట్రో ప్రిల్‌ సంస్థ చేసిన ‘నైట్రోప్రిల్‌ హెచ్‌డీ’ రకంగా లెబనాన్ దర్యాప్తు బృందం భావిస్తోంది. ఈ గోదాము తెరిచినప్పటి పాత చిత్రాల్లో కనిపించిన సంచులపై ఈ కంపెనీ పేరు ఉంది. ఈ సంస్థ క్వారీల్లోకి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుంది. ఈ సంస్థ చేసే పేలుడు పదార్థం అత్యధికంగా 400 మెట్రిక్‌ టన్నులు మాత్రమే నిల్వచేయాలని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న లెబనాన్ దేశంలో ఒకేచోట 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను ఉంచడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు, అంత భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకొంటే వచ్చే నగదు బహుమతికి ఆశపడి అధికారులు దానిని పోర్టులో నిల్వచేశారా..? అని లెబనాన్‌ జర్నలిస్టులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లెబనాన్‌ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, నిర్లక్ష్యం వెరసి లక్షలాది ప్రజల ప్రాణాల మీదికి తెచ్చింది. ః

పేలుడు తీవ్రత అణుబాంబును తలపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ చప్పుడు 200 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్‌ వరకు వినిపించింది. 9 కిలోమీటర్ల దూరంలోని విమానాశ్రయ అద్దాలు పగిలిపోయాయి. భూకంప లేఖినిపై దీని తీవ్ర 3.3గా నమోదైంది. అంటే ఇది చిన్నపాటి భూకంపంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఇది హిరోషిమాపై వేసిన అణుబాంబులో ఐదోవంతు శక్తికి సమానమని అంగ్ల పత్రిక ‘ది సన్‌’ పేర్కొంది. పేలుడు తర్వాత అణు విస్ఫోటంలా పొగలు సుడులు తిరుగుతూ మేఘాన్ని కమ్మేయడం కూడా వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పేలుడు తీవ్రతకు ఈ ఓడరేవు వద్ద ఉన్న మూడు నౌకలు మునిగిపోయాయి.

ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న లెబనాన్ దేశానికి పేలుడు ఘటన పెద్దగా భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఈ పేలుళ్ల ధాటికి దాదాపు 15 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లునట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు పదేళ్ల నుంచి లెబనాన్‌కు భారీగా వలసలు వస్తున్నారు. పొరగునున్న సిరియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడి నుంచి పెద్దసంఖ్యలో లెబనాన్‌కు చేరుకొంటున్నారు. దీనికి తోడు లెబనాన్‌ వాసులే రోజువారీ ఆహారం కోసం అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి తోడు కరోనా వైరస్ కూడా తోడవ్వడంతో ఆ దేశాన్ని మరింత సంక్షోభానికి నెట్టేసింది నిపుణులు భావిస్తున్నారు. ఇక ఆహార పదార్థాల ధరలు 247శాతం మేర పెరిగినట్లు అంచనా. ఇప్పుడు అక్కడ మిగిలి ఉన్న ఆహార గోదాములు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ గాయం నుంచి కోలుకోవడానికి బీరుట్‌కు కొన్ని దశాబ్దాలు పట్టవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.