Infosys Offered: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. ఆ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు.!
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ బదిలీ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో నెలకొల్పిన డెవలప్మెంట్ సెంటర్లో పనిచేయడానికి ముందుకొస్తే రూ.8 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈమేరకు ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలున్న హుబ్బళ్లిలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని అందులో పేర్కొంది.
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ బదిలీ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో నెలకొల్పిన డెవలప్మెంట్ సెంటర్లో పనిచేయడానికి ముందుకొస్తే రూ.8 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈమేరకు ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలున్న హుబ్బళ్లిలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని అందులో పేర్కొంది. ప్రాజెక్టు డెవలప్మెంట్ విధుల్లో ఉన్న బ్యాండ్-2, ఆ పైస్థాయి ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. భారత్లోని ఏ డెవలప్మెంట్ సెంటర్ నుంచైనా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చని పేర్కొంది. బ్యాండ్ 3, అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో రూ.25,000 అందిస్తామని తెలిపింది. ఆ తర్వాత ప్రతీ ఆరు నెలలకు రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని వెల్లడించింది. మొత్తం మీద వీరు రూ.1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారు. అలా బ్యాండ్ 4 ఉద్యోగులకు రెండున్నర లక్షలు, బ్యాండ్ 5 ఉద్యోగులకు రూ.5 లక్షలు, బ్యాండ్ 6 స్థాయి ఉద్యోగులకు రూ.8 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది.
హుబ్బళ్లి టైర్-2 సిటీగా పేరొందింది. ఇక్కడ పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో కంపెనీ ఈ పాలసీని తీసుకొచ్చింది. ముఖ్యంగా ముంబయి-కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో హుబ్బళ్లి ఇన్ఫోసిస్ క్యాంపస్కు సంబంధించి చర్చ జరిగింది. వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రారంభించిన ఈ కేంద్రంలో మొక్కలు మాత్రమే పెరుగుతున్నాయని ఓ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు అక్కడ కార్యకలాపాలు ప్రారంభం కాలేదన్నారు. ఉద్యోగ కల్పన జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం 58 ఎకరాలు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ తాజా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించిన ప్రోత్సాహక పాలసీని కర్ణాటక పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ కొనియాడారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. టెక్ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలు, ఉద్యోగుల సంక్షేమంలో ఇన్ఫోసిస్ నిబద్ధతకు ఇది నిదర్శమని ప్రశంసించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

