Viral Video: నది నీటిపై నడుచుకుంటూ వెళ్లిన మహిళ.. మిస్టరీ ఇదే.! వీడియో వైరల్
వైరల్ అయినట్లు ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. నీటి మట్టం చాలా తక్కువగా ఉన్న ప్రదేశంలో ఆమె నడుస్తోంది. పైగా ఆమె నడుస్తున్న ప్రాంతంలో నీటి అడుగున ఇసుక దిబ్బలు మేట వేశాయి.
నదీ ప్రవాహంపై ఎవరైనా నడుచుకుంటూ వెళ్లడం చూశారా..? దేవతలకు తప్పితే, మానవమాత్రులకు అలాంటిది సాధ్యం కాదు కదా! మధ్యప్రదేశ్లో ఓ మహిళ ఒక్కసారిగా సంచలనంగా మారారు. తెల్లని చీర కట్టుకున్న ఆ మహిళ నర్మదా నది నీటిపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె నర్మదా మాతా అంటూ ప్రజలు కీర్తించారు. తాను సామాన్యురాలిని అని, తనకు ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని ఆ మహిళ చెబుతున్నారు. జనం మాత్రం ఆమెను దైవాంశ సంభూతిరాలిగా కొలుస్తూ.. ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు క్యూ కట్టారు. మరికొందరైతే మానవహారంగా ఏర్పడి నర్మదా తీరం నుంచి ఆమెను స్థానికంగా ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి తరలివస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కావట్లేదు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నది తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిస్టరీగా మారిన ఈ విషయాన్ని తేల్చడానికి పోలీసులు రంగంలోకి దిగారు. తన పేరు జ్యోతి రఘువంశీ అని, నర్మదా నది నీటిపై నడిచేందుకు 10 నెలల కిందట ఇంటి నుంచి వచ్చేశానని పోలీసులతో ఆ మహిళ చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

