Viral Video: నది నీటిపై నడుచుకుంటూ వెళ్లిన మహిళ.. మిస్టరీ ఇదే.! వీడియో వైరల్
వైరల్ అయినట్లు ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. నీటి మట్టం చాలా తక్కువగా ఉన్న ప్రదేశంలో ఆమె నడుస్తోంది. పైగా ఆమె నడుస్తున్న ప్రాంతంలో నీటి అడుగున ఇసుక దిబ్బలు మేట వేశాయి.
నదీ ప్రవాహంపై ఎవరైనా నడుచుకుంటూ వెళ్లడం చూశారా..? దేవతలకు తప్పితే, మానవమాత్రులకు అలాంటిది సాధ్యం కాదు కదా! మధ్యప్రదేశ్లో ఓ మహిళ ఒక్కసారిగా సంచలనంగా మారారు. తెల్లని చీర కట్టుకున్న ఆ మహిళ నర్మదా నది నీటిపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె నర్మదా మాతా అంటూ ప్రజలు కీర్తించారు. తాను సామాన్యురాలిని అని, తనకు ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని ఆ మహిళ చెబుతున్నారు. జనం మాత్రం ఆమెను దైవాంశ సంభూతిరాలిగా కొలుస్తూ.. ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు క్యూ కట్టారు. మరికొందరైతే మానవహారంగా ఏర్పడి నర్మదా తీరం నుంచి ఆమెను స్థానికంగా ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి తరలివస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కావట్లేదు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నది తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిస్టరీగా మారిన ఈ విషయాన్ని తేల్చడానికి పోలీసులు రంగంలోకి దిగారు. తన పేరు జ్యోతి రఘువంశీ అని, నర్మదా నది నీటిపై నడిచేందుకు 10 నెలల కిందట ఇంటి నుంచి వచ్చేశానని పోలీసులతో ఆ మహిళ చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

