AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!

పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!

Phani CH
|

Updated on: Nov 25, 2024 | 9:41 PM

Share

ప్రేమించానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటానని పెద్దల సాక్షిగా ప్రమాణం చేశాడు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. అంతేకాదు.. ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. సీన్ కట్ చేస్తే.. పేరెంట్స్‌తో కలిసి జంప్‌. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిందీ సంఘటన. ప్రియుడి చేసిన పనికి షాకైన ఆ యువతి.. అతడి ఇంటి ముందే ధర్నాకు దిగింది.

కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన ఈశ్వర ప్రసాద్, కర్ణాటకలోని మైసూర్ కు చెందిన చందన… బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరు పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ నెల 14న ఎంగేజ్మెంట్ అని, వచ్చే నెల 6న పెళ్లి అని నిర్ణయించుకున్నారు. పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినందున ఎంగేజ్మెంట్ కు వారం రోజుల ముందే ఆదోనిలోని అబ్బాయి ఇంటికి ప్రేమజంట చేరుకుంది. అయితే 14వ తేదీకి ముందే ప్రియుడు ఈశ్వర్ ప్రసాద్, అతని కుటుంబీకులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇంట్లో చందన మాత్రమే ఉంది. ఎక్కడికెళ్లారో తెలీదు. ఫోన్లు స్విచ్ ఆఫ్. ఒకవేళ మోగినా కూడా ఎత్తడం లేదు. 14వ తేదీ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ డేట్ దాటిపోవడంతో ఆందోళనకు గురైంది చందన. వేరే దారి లేక ప్రియుడు ఇంటి ముందే నిరసన దీక్షకు దిగింది. స్థానికంగా ఉన్న ఒక మహిళా అడ్వకేట్ ఆమెకు సహకారం అందించింది. ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి చేసుకుంటానన్న ఈశ్వర్ .. తనను బెంగళూరు నుంచి ఆదోనికి తీసుకొచ్చి మోసం చేశారని చందన వాపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??

తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??

మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

వాట్సాప్‌లో సీక్రెట్‌ చాటింగ్‌.. ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది ??

యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది