AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరి మహిళలకు గుడ్‌ న్యూస్‌.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఒంటరి మహిళలకు గుడ్‌ న్యూస్‌.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం

Phani CH
|

Updated on: Mar 12, 2024 | 12:53 PM

Share

దేశంలోనే తొలిసారి ఝార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకునే మహిళలకు ప్రభుత్వం రూ. 2 లక్షల ప్రోత్సాహకం అందిస్తుంది. అయితే, లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు.

దేశంలోనే తొలిసారి ఝార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకునే మహిళలకు ప్రభుత్వం రూ. 2 లక్షల ప్రోత్సాహకం అందిస్తుంది. అయితే, లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు లబ్దిదారు పునర్వివాహ తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు దివంగత భర్త మరణ ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మహిళలు సమాజంలో ఒంటరిగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని అధికారి ఒకరు తెలిపారు. అలాంటి పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందన్నారు. వితంతువుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, మహిళల పునర్వివాహం పట్ల సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంట గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.100 తగ్గింపు

తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

రూ.12,000 కోట్ల విలువ చేసే.. మానవ వెంట్రుకల అక్రమ రవాణా

Gaami: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న ‘గామి’

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. పార్లమెంట్‌కు రైతు బిడ్డ ??