ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అడవిలో దారుణం జరిగింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే 50 ఏళ్ల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అడవిలో దారుణం జరిగింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే 50 ఏళ్ల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారి వివరాల ప్రకారం.. సోనుర్లి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గాలింపు చేపట్టగా ఇనుప గొలుసుతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న స్థితిలో మహిళను గుర్తించారు. బాధితురాలి వద్ద అమెరికా పాస్పోర్టు, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం
వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు
మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే
అలాంటివారితో వాదించడం వేస్ట్.. నయన్ ఘాటు రిప్లై
మరో 18 యూ ట్యూబ్ ఛానళ్లపై బ్యాన్.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

