వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు
వందేభారత్ రైల్లో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. శాకాహారి అయిన ఆయనకు మాంసాహార భోజనం అందించడమే అందుకు కారణం. ఇటీవల ఓ పెద్దాయన పశ్చిమబెంగాల్లోని హావ్డా నుంచి రాంచీకి వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు. భోజనం వేళ థాలీని ఆర్డర్ చేశాడు. అయితే.. సిబ్బందిలో ఒకరు పొరబాటున మాంసాహారాన్ని వడ్డించారు.
వందేభారత్ రైల్లో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. శాకాహారి అయిన ఆయనకు మాంసాహార భోజనం అందించడమే అందుకు కారణం. ఇటీవల ఓ పెద్దాయన పశ్చిమబెంగాల్లోని హావ్డా నుంచి రాంచీకి వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు. భోజనం వేళ థాలీని ఆర్డర్ చేశాడు. అయితే.. సిబ్బందిలో ఒకరు పొరబాటున మాంసాహారాన్ని వడ్డించారు. కాసేపటికి అది నాన్ వెజ్ అని గుర్తించాడు. తనకు మాంసాహారాన్ని వడ్డించాడని వెయిటర్పై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ‘‘తప్పు జరిగింది. కానీ, అలా దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదు’’.. ‘‘ఆహారం విషయంలో సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సింది’’.. ‘‘ఏది ఏమైనప్పటికీ ఆ ప్రయాణికుడు చేసింది తప్పే’’ అంటూ కామెంట్లు పోస్టు చేశారు. ఈ ఘటనపై తూర్పు రైల్వేశాఖ స్పందించింది. ‘‘పొరబాటు జరిగింది. సమస్యను పరిష్కరించాం’’ అని ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే
అలాంటివారితో వాదించడం వేస్ట్.. నయన్ ఘాటు రిప్లై
మరో 18 యూ ట్యూబ్ ఛానళ్లపై బ్యాన్.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..
నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. దేవుడి మహిమే నంటూ భక్తులు పూజలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

