Mahanandi: మహా శివరాత్రి వేళ ..మహానంది క్షేత్రంలో అద్భుతం.! వీడియో వైరల్
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో అద్బుత ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు ఆలయంలో రాత్రి జరిగిన లింగోద్భవ కార్యక్రమంలో శ్రీ మహానంధీశ్వర స్వామికి అవు పాలతో అభిషేకం నిర్వహించారు.స్వామికి అభిషేకించిన పాలు ఆలయం క్రింద ఉన్న రుద్రగుండం కోనేరులో ప్రవహించాయి.ఈ అద్భుమైన దృశ్యాలను చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించి పోయారు.
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో అద్బుత ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు ఆలయంలో రాత్రి జరిగిన లింగోద్భవ కార్యక్రమంలో శ్రీ మహానంధీశ్వర స్వామికి అవు పాలతో అభిషేకం నిర్వహించారు.స్వామికి అభిషేకించిన పాలు ఆలయం క్రింద ఉన్న రుద్రగుండం కోనేరులో ప్రవహించాయి.ఈ అద్భుమైన దృశ్యాలను చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించి పోయారు. శ్రీశైలంలోని శ్రీ మహానంధీశ్వర స్వామి విగ్రహం క్రింది నుంచి నీటి ధార ప్రవహిస్తుంటుందని పురాణాల్లో చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ ఘటనతో ఆ విషయం నిర్ధారణ కావడంతో స్వామి క్రింది నుంచి వచ్చే నీరే ఆలయంలోని రుద్రగుండం,బ్రహ్మ,విష్ణు గుండం కోనేరులో ప్రవహిస్తాయని స్పష్టం అయిందని భక్తులు భావిస్తున్నారు. ఈ కోనేరులో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని నానుడి. అంతే కాకుండా ఆలయంలో ఉన్న మూడు కోనేరులలో ఎప్పటికీ ఒకే స్థాయిలో నీళ్ళు ప్రవహించడం విశేషంగా ఇక్కడి మరో విశేషం. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సమయంలో రుద్రగుండం కోనేరులో స్వామి వారిని అభిషేకించిన పాలను దర్శించుకున్న భక్తులు ఇదంతా దైవ లీల అంటూ శివనామస్మరణలో మునిగిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

