Mahanandi: మహా శివరాత్రి వేళ ..మహానంది క్షేత్రంలో అద్భుతం.! వీడియో వైరల్
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో అద్బుత ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు ఆలయంలో రాత్రి జరిగిన లింగోద్భవ కార్యక్రమంలో శ్రీ మహానంధీశ్వర స్వామికి అవు పాలతో అభిషేకం నిర్వహించారు.స్వామికి అభిషేకించిన పాలు ఆలయం క్రింద ఉన్న రుద్రగుండం కోనేరులో ప్రవహించాయి.ఈ అద్భుమైన దృశ్యాలను చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించి పోయారు.
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో అద్బుత ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శివరాత్రి పర్వదినం నాడు ఆలయంలో రాత్రి జరిగిన లింగోద్భవ కార్యక్రమంలో శ్రీ మహానంధీశ్వర స్వామికి అవు పాలతో అభిషేకం నిర్వహించారు.స్వామికి అభిషేకించిన పాలు ఆలయం క్రింద ఉన్న రుద్రగుండం కోనేరులో ప్రవహించాయి.ఈ అద్భుమైన దృశ్యాలను చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించి పోయారు. శ్రీశైలంలోని శ్రీ మహానంధీశ్వర స్వామి విగ్రహం క్రింది నుంచి నీటి ధార ప్రవహిస్తుంటుందని పురాణాల్లో చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ ఘటనతో ఆ విషయం నిర్ధారణ కావడంతో స్వామి క్రింది నుంచి వచ్చే నీరే ఆలయంలోని రుద్రగుండం,బ్రహ్మ,విష్ణు గుండం కోనేరులో ప్రవహిస్తాయని స్పష్టం అయిందని భక్తులు భావిస్తున్నారు. ఈ కోనేరులో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని నానుడి. అంతే కాకుండా ఆలయంలో ఉన్న మూడు కోనేరులలో ఎప్పటికీ ఒకే స్థాయిలో నీళ్ళు ప్రవహించడం విశేషంగా ఇక్కడి మరో విశేషం. శివరాత్రి బ్రహ్మోత్సవాలు సమయంలో రుద్రగుండం కోనేరులో స్వామి వారిని అభిషేకించిన పాలను దర్శించుకున్న భక్తులు ఇదంతా దైవ లీల అంటూ శివనామస్మరణలో మునిగిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

