వీడో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్లాడో చూడండి !!

దొంగలు ఒక్కసారి ఫిక్స్‌ అయ్యారంటే పేద, గొప్ప, చిన్న, పెద్ద అనేం చూడరు. వారికి కావలసింది వారు దోచుకుపోతారంతే. పొట్ట కూటి కోసం తోపుడు బండ్లు పై చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికే వాళ్లను సైతం దొంగలు వదలడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ చిరువ్యాపారి రోడ్డు పక్కన పెట్టుకున్న తోపుడు బండిని ఎత్తుకుపోయాడు ఓ దొంగ. అర్థరాత్రి వేళ దర్జాగా తోపుడు బండిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. సత్తుపల్లికి చెందిన వేల్పుల లక్ష్మి

వీడో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్లాడో చూడండి !!

|

Updated on: Aug 10, 2023 | 9:44 PM

దొంగలు ఒక్కసారి ఫిక్స్‌ అయ్యారంటే పేద, గొప్ప, చిన్న, పెద్ద అనేం చూడరు. వారికి కావలసింది వారు దోచుకుపోతారంతే. పొట్ట కూటి కోసం తోపుడు బండ్లు పై చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికే వాళ్లను సైతం దొంగలు వదలడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ చిరువ్యాపారి రోడ్డు పక్కన పెట్టుకున్న తోపుడు బండిని ఎత్తుకుపోయాడు ఓ దొంగ. అర్థరాత్రి వేళ దర్జాగా తోపుడు బండిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. సత్తుపల్లికి చెందిన వేల్పుల లక్ష్మి అనే మహిళ తోపుడు బండి పై మొక్క జొన్న కంకులు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. ప్రతి రోజు లాగానే తను రాత్రి వరకు మొక్క జొన్న కంకులు అమ్ముకుని రోడ్డు పక్కనే తోపుడు బండి నిలిపి ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు వచ్చి చూసేసరికి తన బండి కనిపించకపోయేసరికి లబోదిబోమంది. బండి లేకపోవడంతో జీవనాధారం కోల్పోయానని, ఇప్పుడు తమ కుటుంబం రోడ్డున పడిందని, ఆవేదన వ్యక్తం చేసింది. సరుకుతో సహా బండిని దొంగలు ఎత్తుకుపోయారని విలపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంద మందితో డేటింగ్‌ చేసిన బ్రిటన్‌ అమ్మాయి !!

అసలే కింగ్ కోబ్రా !! తోక పట్టి లాగితే ఊరుకుంటుందా ??

డెలివరీ బాయ్‌ క్రియేటివిటికీ నెటిజన్లు ఫిదా

మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడింది

కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే ??

 

Follow us