50 ఏళ్లుగా అన్నమే తినని వ్యక్తి !! కేవలం వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జీవనం
సాధారణంగా ఎవరైనా ఒక్కపూట అన్నం తినకపోతే నీరసించిపోయి కాళ్లు వేలాడేస్తారు. అలాంటిది ఏకంగా యాభై ఏళ్లుగా అన్నమే ముట్టని ఓ వ్యక్తి ఎంతో చలాకీగా, ఆరోగ్యంగా తన పనులు తాను చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇన్నేళ్లుగా తాను కేవలం సాత్వికాహారం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
జక్రాన్పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వయసున్న రిటైర్డ్ టీచర్ లొక్కిడి గంగారాం 50 ఏళ్లకు పైగా అన్నం ముట్టుకోకుండా జీవిస్తున్నాడు. 1971లో అజీర్తి సమస్య కారణంగా అన్నం మానేసిన ఆయన అప్పటి నుంచి పళ్లు, పాలు, నీళ్లు, అప్పుడప్పుడు పల్లీలతోనే కడుపు నింపుకొంటున్నారు. 1972లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందిన ఆయన 2004లో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. తరువాత జక్రాన్పల్లిలోని మనోహరాబాద్ గ్రామ శివారులో ఎకరం స్థలం కొని పాండురంగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి భర్తను కాపాడుకున్న భార్య
నువ్వు దేవుడయ్యా సామీ !! రూ.కోటితో బిచ్చగాడు విందు
గర్ల్ ఫ్రెండ్ కోసం 11 వారాలు ఫ్లైట్ జర్నీ.. దేశాలే దాటేశాడుగా
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

