Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వం చాటుకున్న మెట్రో సిబ్బంది.. చికిత్స చేసి ప్రాణం పోసాడు

మానవత్వం చాటుకున్న మెట్రో సిబ్బంది.. చికిత్స చేసి ప్రాణం పోసాడు

Phani CH

|

Updated on: Apr 24, 2023 | 9:10 PM

హైదరాబాద్ మెట్రో సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ షాక్‌కు గురైన పావురాన్ని ర‌క్షించి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్‌లో ఎల‌క్ట్రిక్ వైర్ తగిలిన పావురం

హైదరాబాద్ మెట్రో సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ షాక్‌కు గురైన పావురాన్ని ర‌క్షించి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్‌లో ఎల‌క్ట్రిక్ వైర్ తగిలిన పావురం కిందకు పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో అల్లాడింది. పావురాన్ని గమనించిన మెట్రో సిబ్బంది వెంటనే సపర్యలు చేసి దాని ప్రాణాలు కాపాడారు. అనంతరం పావురానికి మంచినీళ్లు తాగించి వదిలేశారు. దీన్నంతటిని అక్కడే ఉన్న మెట్రో ప్రయాణికుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. మాన‌వ‌త్వం చాటుకున్న మెట్రో సిబ్బందిని నెటిజన్లు ప్రశంస‌ల‌తో ముంచెత్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత కార్లకు భారీ డిమాండ్‌.. ఒక్కో కారుకు రూ. 300 కోట్లకు పైనే !!

ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు

పిట్ట బావుందని ముట్టుకున్నారో అంతే సంగతులు.. క్షణాల్లో మృతి

విడాకుల సెలబ్రేషన్స్‌.. పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు

ఎల్లుండి RRR టీమ్‌తో అమిత్‌షా తేనీటి విందు

Published on: Apr 24, 2023 09:10 PM