మీ ఊరిలో కరెంటు పోతే.. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయిండి
అసలే వచ్చేది వేసవి కాలం. కరెంటు కోతల కాలం. కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో కరెంటు కోతల కంప్లైట్స్ కు ఎస్పీడీసీఎల్ కార్యాచరణ సిద్దం చేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే టోల్ఫ్రీ నెంబరును సంప్రదిస్తారు. ఇది ఇన్నాళ్లూ గ్రేటర్ హైదరాబాద్కే పరిమితం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది.
విద్యుత్ కంప్లైంట్స్ నెంబర్ 1912 సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ దక్షిణ డిస్కమ్ ఎస్పీడీసీఎల్-హైదరాబాద్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇకపై గ్రామాల్లో కరెంట్ పోతే నేరుగా 1912 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. సరఫరాలో అంతరాయం కలిగినా, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి తలెత్తినా టోల్ఫ్రీ నెంబరును సంప్రదించాలని దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ఒక ప్రకటనలో సూచించారు. వచ్చే వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండుకు తగ్గట్టుగా వేసవి కాల ప్రణాళిక కోసం కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం వివిధ జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పరిశీలించేందుకు గాను పలువురు అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. అయితే కరెంటు కోతలపై నోడల్ అధికారులనే నియమించారంటే ఈసారి కరెంటు కోతలు భారీగానే ఉండనున్నాయనే టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి ఇళ్ల ప్రాంగణంలో తచ్చాడిన వింత జంతువు.. అదేమిటి అని ఆరా తీయగా
రూ.2,500 కోట్ల ఆస్తికి వారసుడు.. కానీ పాపం
ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగితే ఇన్ని ప్రయోజనాలా
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్పోర్ట్కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

