ప్రేమతో కూతురును చూడ్డానికి వెళితే.. మెడలో ఉన్నది కాస్తా కొట్టేశారు
హైదరాబాద్ మహానగరంలో చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని మెడలో ఉన్న బంగారు గొలుసులు తెంపుకెళుతున్నారు. పోలీసులు పట్టుకుని జైళ్లకు పంపించినా దొంగతనాలు మాత్రం మానడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది.
మల్లయ్య టవర్ వద్ద నిర్మల అనే వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపుకెళ్లారు. యాక్టివా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుండి ఆరు తులాల బంగారు చైన్ను ఎత్తుకెళ్లిపోయారు. నిర్మల సొంత ఊరు మహబూబ్నగర్ జిల్లా బెబ్బెర్ల గ్రామం. అత్తాపూర్ సమీపంలో ఉన్న తన కూతురును చూడ్డానికి నగరానికి వచ్చింది. తన సొంతూరుకు తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు చూసి వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు వృద్దురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే చైన్ స్నాచర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి చేతిరాత బాగోలేదని.. ట్యూషన్ టీచర్ దారుణం..
పడగ విప్పిన పాముతో డాన్స్ ఏంట్రా అయ్యా.. ఆలా చేస్తే ఇలానే అవుతుంది మరి
ముచ్చటగా 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన మహిళకు ఊహించని షాక్
30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం
బిగ్ అలర్ట్.. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మూడిందే.. తరువాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు..
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

