ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
ఏనుగులు ఇటీవల అడవులను వదిలి పంట పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించిన రైతులను పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు పొలాల్లోకే కాకుండా ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఓ ఏనుగు ఎక్కడికి నుంచి వచ్చిందో ఓఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించి నానా బీభత్సం చేసేసింది.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగులు పగబట్టాయా ఏంటి ఇలా దాడి చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినదిగా తెలిసింది. వీడియో ప్రకారం.. జనవరి 18 శనివారం రాత్రి ఒక ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో నలుగురు కార్మికులు ఉన్నట్టుగా తెలిసింది. రాత్రి సమయంలో వచ్చిన అనుకోని అతిథిని చూడగానే ఆ ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ, చాకచక్యంగా వ్యవహరించి వారు ఏనుగు కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే, ఆ ఏనుగు ఏం చేస్తుందో చూడాలని ఈ సంఘటనను వారు ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ ఇంటి ద్వారం చిన్నదిగా ఉండటం, ఏనుగు భారీగా ఉండటంతో అది లోపలికి ప్రవేశించలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిక్టాక్ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..
నెలకు ₹20తో మీ సిమ్ యాక్టివ్.. ట్రాయ్ రూల్ తెలుసా ??
చిరు వ్యాపారులనూ వదలని సైబర్ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

