ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
ఏనుగులు ఇటీవల అడవులను వదిలి పంట పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించిన రైతులను పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు పొలాల్లోకే కాకుండా ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఓ ఏనుగు ఎక్కడికి నుంచి వచ్చిందో ఓఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించి నానా బీభత్సం చేసేసింది.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగులు పగబట్టాయా ఏంటి ఇలా దాడి చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినదిగా తెలిసింది. వీడియో ప్రకారం.. జనవరి 18 శనివారం రాత్రి ఒక ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో నలుగురు కార్మికులు ఉన్నట్టుగా తెలిసింది. రాత్రి సమయంలో వచ్చిన అనుకోని అతిథిని చూడగానే ఆ ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ, చాకచక్యంగా వ్యవహరించి వారు ఏనుగు కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే, ఆ ఏనుగు ఏం చేస్తుందో చూడాలని ఈ సంఘటనను వారు ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ ఇంటి ద్వారం చిన్నదిగా ఉండటం, ఏనుగు భారీగా ఉండటంతో అది లోపలికి ప్రవేశించలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిక్టాక్ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..
నెలకు ₹20తో మీ సిమ్ యాక్టివ్.. ట్రాయ్ రూల్ తెలుసా ??
చిరు వ్యాపారులనూ వదలని సైబర్ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

