చిరు వ్యాపారులనూ వదలని సైబర్ మోసగాళ్లు.. మోగకపోతే మోసపోయినట్లే!
ఇబ్రహీంపట్నం రింగుకూడలిలోని ఓ పండ్ల దుకాణం వద్ద రూ.120తో యాపిల్ పండ్లు కొనుగోలు చేసిన యువకుడు అక్కడున్న స్కానర్తో తన మొబైల్ నుంచి నగదును పంపినట్లు దుకాణదారుడికి చూపాడు. సాయంత్రానికి పండ్ల దుకాణ యాజమాని ఫోన్ చూసుకోగా రూ.120 వచ్చినట్లు కనిపించలేదు. ఎంత సేపు ఆలోచించినా నగదు ఎందుకు రాలేదో అర్థంకాక అయోమయానికి గురయ్యాడు.
అలాగే కొండపల్లిలోని ఓ పచారీ దుకాణం వద్దకు వెళ్లిన ఓ యువకుడు రూ.400లకు సరుకులు కొనుగోలు చేశాడు. తన చరవాణి నుంచి అక్కడ ఉన్న స్కానర్కు ఆ నగదును పంపినట్లు తన ఫోన్లో దుకాణ యాజమానికి చూపాడు. ఆ సమయంలో స్కానర్ వాయిస్ నోటిఫికేషన్ మెషిన్ మోగలేదు. తర్వాత వస్తుందిలే అని వదిలేశాడు. అనుమానం వచ్చి అదే రోజు రాత్రి తిరిగి తన ఫోన్పే ఖాతాను చెక్చేసుకోగా యువకుడు పంపిన రూ.400 రాలేదు. దీంతో మోసపోయానని లబోదిబోమన్నాడు. సైబర్ నేరాల్లో ఒక చోట రూ.లక్షలు, మరో చోట రూ.వేలు మోసపోయారని మనం నిత్యం వింటూనే ఉంటాం..అయితే మోసగాళ్ల ఆగడాలు లక్షల్లోనే ఉన్నాయనుకుంటే పొరపాటే. చివరకు చిల్లర రూపాయిల వద్ద కూడా వీరి జిమ్మిక్కులకు అంతులేకుండా పోయింది. పండ్ల దుకాణాలు, టిఫిన్ కొట్లు, రద్దీ ఉండే చిల్లర దుకాణాలు ఈ మాయగాళ్లకు వేదికలయ్యాయి. కొంత మొత్తంలో కొనుగోలు చేస్తూ దుకాణదారుడు బిజీగా ఉన్న సమయంలో స్కానర్ ద్వారా పంపామని చెప్పి తన ఫోన్లో ఉంచిన నకిలీ యాప్ ద్వారా వాటిని చూపి అక్కడ నుంచి జారుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘బిగ్ బీ’నా మజాకా.. అపార్ట్మెంట్ అమ్మకంపై 168 శాతం లాభం
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ
ఇది ఇల్లు కాదు.. ఔషధ వనం.. అణువణువూ ఆయుర్వేదమే
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

