AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెత్తబుట్టలో కనిపించిన కోట్లు.. అంతలోనే

చెత్తబుట్టలో కనిపించిన కోట్లు.. అంతలోనే

Phani CH
|

Updated on: Nov 02, 2025 | 6:36 PM

Share

ఓ వ్యక్తిని ఊహించని విధంగా అదృష్టం వరించింది. అదే వారి కుటుంబంలో కలతలు రేపింది. కోట్లు విలువ చేసే షేర్‌ మార్కెట్‌కు సంబంధించిన పత్రాలు అతనికి ఇంట్లోని చెత్త బుట్టలో దొరికాయి. అయితే, అదికాస్త కుటుంబంలో వివాదానికి దారితీసింది. ఓ వ్యక్తి గుజరాత్‌లోని ఉనా గ్రామంలో చనిపోయిన తన తాతగా సావ్జీపటేల్‌ ఇంటికి వెళ్లాడు.

ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా.. ఇంట్లో ఉన్న ఓ చెత్త బుట్టలో షేర్‌ మార్కెట్‌కు సంబంధించిన పత్రాలు దొరికాయి. వాటి విలువ దాదాపు రూ.2.5 కోట్లు. దీంతో తాను కోటీశ్వరుడిని అయిపోయానని అతను సంబరపడిపోయాడు. కానీ, ఆ ఆనందం అతనికి ఎంతోసేపు నిలవలేదు. ఆ షేర్లపై అతడితో పాటు అతని తండ్రికి కూడా హక్కులు ఉన్నాయని తెలిసింది. దాంతో వాటికి తాను వారసుడినంటే.. తానంటూ వాదించుకున్నారు. దీంతో ఇది కాస్తా కుటుంబంలో వివాదానికి దారితీసింది. సావ్జీ పటేల్‌.. డయ్యూలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారు. దీనికి ముందు ఆ హోటల్‌ యజమానికి చెందిన బంగ్లాలో హౌస్‌కీపర్‌గా ఉన్నారు. రైతు అయిన పటేల్‌ తండ్రికి ఉనా గ్రామంలో ఓ ఇళ్లు ఉంది. పటేల్‌ చనిపోయే ముందు.. ఆస్తి మొత్తానికి తన మనవడే వారసుడని పేర్కొన్నారు. కానీ, ఈ షేర్‌ మార్కెట్‌ పత్రాలపై హక్కును మాత్రం తన మనవడితో పాటు కుమారుడికి కూడా చెందేలా రాశారు. దీంతో తానే అసలైన వారసుడినని, షేర్ల విలువ మొత్తం తనకే దక్కుతుందని పటేల్‌ కుమారుడు వాదించాడు. అందుకు మనవడు నిరాకరించాడు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టుకు చేరింది. గుజరాత్‌ హైకోర్టు నవంబరు 3న దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జియో యూజర్లకు గూగుల్ బంపరాఫర్..

ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. అనంత విశ్వంలో తేలియాడుతారు!

వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్‌.. ఎందుకంటే ??

తాగి నడిపితే.. నేరుగా జైలుకే..!

20 ఏళ్ల యువతికి కిడ్నీ డ్యామేజ్.. కారణం తెలిస్తే షాక్‌