బాబోయ్.. రోడ్డుపై భారీ పైథాన్… ఆ తర్వాత జరిగిందిదే
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. భారీ సైజ్లో ఉన్న కొండ చిలువ జనావాసాల్లో హల్చల్ చేసింది. దీంతో అందరూ పరుగులు తీశారు. చివరకు స్నేక్ క్యాచర్ దానిని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజ పల్లి గ్రామం వద్ద భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. దీంతో భయభ్రాంతులైన స్థానికులు పరుగులు తీశారు.
అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. భారీ సైజ్ లో ఉండటంతో అది కదలలేదు. తరువాత.. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు స్నేక్ క్యాచర్ సహకారంతో దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంత పెద్ద భారీ కొండచిలువ ప్రజలు నివసించే ప్రాంతానికి రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కొండచిలువ గురించి ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా ఇంతేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో ఏం చేయాలో తెలియక హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద వదిలిపెట్టారు. తరువాత అటవీ శాఖ అధికారులు..ఈ కొండ చిలువను. అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోపాల్ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్పూర్ ‘బాల్కనీ ఫ్లైఓవర్’
క్షుద్ర పూజలకు విరుగుడు ఉందా? ఆ మంత్రానికి అంత శక్తి ఉందా?
30 పైసలకు పడిపోయిన కిలో ఉల్లి ధర.. రైతు ఆత్మహత్య
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

