కియా కారులో వచ్చి పట్టపగలు చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా ??
దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్లో జరుగుతున్న జీ20 సదస్సులో అలంకరణ కోసం తీసుకొచ్చిన పూల కుండీల మాయమయ్యాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు..
దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్లో జరుగుతున్న జీ20 సదస్సులో అలంకరణ కోసం తీసుకొచ్చిన పూల కుండీల మాయమయ్యాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. వీరు చోరీ చేసిన తీరును చూసి పోలీసులు షాక్ అయ్యారు. దర్జాగా వీఐపీ లైసెన్స్ ప్లేట్ ఉన్న అధునాతన వాహనంలో వచ్చిన దొంగలు.. పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను తీసుకొని వారి లగ్జరీ కారు ట్రంక్లో పెట్టుకుంటున్న వీడియోలో వైరల్గా మారింది. G20 సమ్మిట్ పోస్టర్తో పాటు, ఆ ప్రాంతంలో రంగురంగుల పూల కుండీలు కూడా తస్కరించారు. శంకర్ చౌక్లో జరిగిన G20 ఈవెంట్ ప్రాంగణంలో ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను దొంగిలించిన వీడియోను జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఈ వీడియోని షేర్ చేస్తూ పోయారు. ఇది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

