యూపీలో తేలియాడే రామసేతు రాయి !! భక్తుల పూజలు
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లా లోని ఇసాన్ , నదిలో తేలుతున్న రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది,
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లా లోని ఇసాన్ , నదిలో తేలుతున్న రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది, దానిపై రామ్ అని వ్రాసి ఉండటమే కాకుండా ఆ రాయి నీటిలో మునిగిపోకుండా తేలడం వింతగా మారింది. ఈ రాయి దాదాపు 6 కిలోల బరువు ఉన్నట్లుగా నిర్ధారించారు. నీటిలో తేలియాడే ఈ రాయిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈ రాయిని రామ రావణ యుద్ధంలో నల నీలులు నిర్మించిన రామసేతు వంతెనకు చెందిన రాయిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు. ఇసాన్ నది థానా బేవార్ ప్రాంతంలోని అహ్మల్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జులై 30వ తేదీ ఉదయం గ్రామానికి చెందిన కొందరు చిన్న పిల్లలు నదిలో చేపలు పట్టుకుంటునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నది ఒడ్డున ఓ నల్లరాయి తేలుతూ కనిపించింది. పిల్లలు నది నుండి రాయిని బయటకు తీశారు, దానిపై రామ్ అని వ్రాసి ఉంది. దాంతో ఈ రాయిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీకట్లో ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం !! ఆ యువకుడు ఏంచేశాడో చూడండి.
మనిషిలా కూర్చుని ఆహారం తింటున్న మేక !! నెట్టింట వీడియో వైరల్
హోం వర్క్ చేయలేక విసిగిపోయిన కుర్రాడు !! ఈ లోకం విడిచిపోతానంటూ అమ్మపై ఆగ్రహం
సెలయేట్లో ఎలుగుబంట్ల గెట్ టుగెదర్ !! ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
రాలిన ఆకులా ఉన్న జీవి !! విశాఖ తీరంలో ప్రత్యక్షం
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

