ప్రేమకు, శాంతికి చిహ్నాలు.. ఇప్పుడు ప్రాణాంతకం అవుతున్నాయా ??
మెట్రో నగరాల్లో కపోతాల సంఖ్య పెరుగుతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది.పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పుణె మున్సిపల్ కార్పొరేషన్, వాటిని పోషించే వారిపై శిక్షార్హమైన చర్యలను ప్రారంభించింది.పావురాల రెట్టలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితోపాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్ ప్రమాదం పెరుగుతుంది.
కానీ, ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమతుల్యతకు సంకేతం. నగరాలలో కనిపిస్తున్న పావురాలు చాలావరకు హైబ్రీడ్ పావురాలని ఆహారం, సమాచారం, ఇళ్లలో పెంచుకోవడానికి పావురాలను మనుషులు అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు అవి కొండా కోనల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్లు పెట్టుకుని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి. వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి.కానీ, ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగా దొరకడం లేదు. వాటిలో అప్పటి ఆటవిక లక్షణాలు ఇంకా కొన్ని ఉన్నప్పటికీ, ఇప్పుడవి మరింత సాధారణ పక్షులుగా మారిపోయా ఇలా జంతువులకు, మనుషులకు దగ్గరగా మసలుతున్న పావురాల సంఖ్య పెరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎముకలు కొరికే చలి…ఇంకా ఎన్నాళ్లు ??
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

