New Born Baby: వీళ్లు మనుషులేనా..? చనిపోయిందని ఖననం చేస్తుండగా కదిలిన శిశువు..
చనిపోయిందనుకున్న శిశువులో కదలికలు చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆనందంతో బిడ్డను తీసుకొని ఆస్పత్రికి పరుగెత్తారు. ఈ విచిత్ర సంఘటన జమ్ముకాశ్మీర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
చనిపోయిందనుకున్న శిశువులో కదలికలు చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆనందంతో బిడ్డను తీసుకొని ఆస్పత్రికి పరుగెత్తారు. ఈ విచిత్ర సంఘటన జమ్ముకాశ్మీర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…జమ్ముకాశ్మీర్ బంకూట్ కు చెందిన బషరత్ అహ్మద్ భార్య, రంబాన్ జిల్లా బనిహల్ ఉప జిల్లా ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆస్పత్రి సిబ్బంది పుట్టిన బిడ్డ ప్రాణంతో లేదని చెప్పారు. దాంతో పుట్టెడు దుఃఖంతో ఆ తల్లిదండ్రులు మృత శిశువును ఖననం చేసేందుకు స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ అంతిమ సంస్కారాలు చేసే క్రమంలో శిశువులో కదలికలు గమనించారు. వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి సిబ్బంది ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కాగా ఇదంతా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే బాధితులు నేరుగా దవాఖానాకు వెళ్లి ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి నర్స్, స్వీపింగ్ కార్మికురాలిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

