ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూతపడిన డోర్లి 2 ఓపెన్ కాస్ట్ గనిలో నీరు రసాయనాలతో కలిసి నీలి రంగులోకి మారింది. ఈ 'బ్లూ వాటర్' ప్రాంతం పర్యాటక ఆకర్షణగా మారింది. పోలీసులు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా, ప్రజలు సెల్ఫీలు, డ్రోన్ వీడియోలతో తరలి వస్తున్నారు. ఈ అద్భుతమైన, ప్రమాదకరమైన అందం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మూతపడిన ఓపెన్ కాస్ట్ గని అందరిని ఆకట్టుకుంటోంది. ఆ గనిలోకి చేరిన నీరు బ్లూ కలర్ లోకి మారడంతో ఆ వాటర్ ను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. స్థానిక పోలీసులు మాత్రం అది ప్రమాదకర ప్రాంతం అక్కడికి వెళ్ల వద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఆ బ్యూ వాటర్ గని వద్ద పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు స్థానికులు. ప్రమాదం అంచునే సెల్పీలతో సందండి చేస్తున్నారు. కొమురంభీం జిల్లా తిర్యాణి మండలంలో రెండేళ్ల క్రితం మూత పడిన డోర్లి 2 ఓపెన్ కాస్ట్ నుంచి బయటకు వచ్చిన నీరు రసాయనాలతో కలవడం వల్ల బ్లూ కలర్ లోకి మారాయి. దీంతో చుట్టూ కొండల మధ్య ఉన్న ఆ బ్లూకలర్ నీటిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులతో పాటు, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో నీటి అడుగు దాదాపు 70 అడుగుల లోతు ఉందని అటు వైపు వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నీటిలోనికి దిగనివ్వక పోవడంతో గట్టుపై నుంచే దూరంగా చూసి చాలా మంది సెల్ ఫోన్ లలో ఆ బ్లూ వాటర్ అందాలను బందిస్తున్నారు. డ్రోన్ లతో మరింత అందంగా ఆ బ్లూ వాటర్ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు
భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

