వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు
శ్రీ సత్యసాయి జిల్లాలో వాల్మీకి మహర్షి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేసి, నిలబడి నమస్కరించిన దృశ్యం ఇప్పుడు వైరల్గా మారింది. బోయవాడిగా వేట వదిలి కవిగా మారిన వాల్మీకి మహర్షి గొప్పదనాన్ని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. పశుపక్ష్యాదులు సైతం ఆయన పట్ల చూపిన భక్తి అద్భుతం. ఈ వీడియో సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది.
కిరాతుడైన బోయవాడు జంట పక్షులలో ఓ పక్షిని వేటాడగా.. దాని జంటపక్షి విలపించిన తీరును చూసి చలించిపోయాడు. కన్నీటితో వాటికి నివాళి అర్పించి వేటను వదిలి మానవత్వం పరిమలించగా కవిగా మారాడు. అద్భుతమైన రామాయణాన్ని రచించాడు. అందుకే మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఆ మహాకవి రూపాన్ని చూడగానే నమస్కరించకుండా ఉండలేరు. శ్రీసత్యసాయి జిల్లాలో అదే జరిగింది. వాల్మీకి విగ్రహం చుట్టూ ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేశాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సక్తికర ఘటన జరిగింది. వాల్మీకి విగ్రహం దగ్గరకు వచ్చిన ఎలుగుబంట్లు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ఆ తర్వాత తిరిగి వెళుతూ లేచి నిలుచుని నమస్కరించి వెళ్లాయి. ఎలుగుబంట్లు వచ్చి వెళ్లిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

