వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు
శ్రీ సత్యసాయి జిల్లాలో వాల్మీకి మహర్షి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేసి, నిలబడి నమస్కరించిన దృశ్యం ఇప్పుడు వైరల్గా మారింది. బోయవాడిగా వేట వదిలి కవిగా మారిన వాల్మీకి మహర్షి గొప్పదనాన్ని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. పశుపక్ష్యాదులు సైతం ఆయన పట్ల చూపిన భక్తి అద్భుతం. ఈ వీడియో సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది.
కిరాతుడైన బోయవాడు జంట పక్షులలో ఓ పక్షిని వేటాడగా.. దాని జంటపక్షి విలపించిన తీరును చూసి చలించిపోయాడు. కన్నీటితో వాటికి నివాళి అర్పించి వేటను వదిలి మానవత్వం పరిమలించగా కవిగా మారాడు. అద్భుతమైన రామాయణాన్ని రచించాడు. అందుకే మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఆ మహాకవి రూపాన్ని చూడగానే నమస్కరించకుండా ఉండలేరు. శ్రీసత్యసాయి జిల్లాలో అదే జరిగింది. వాల్మీకి విగ్రహం చుట్టూ ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేశాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సక్తికర ఘటన జరిగింది. వాల్మీకి విగ్రహం దగ్గరకు వచ్చిన ఎలుగుబంట్లు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ఆ తర్వాత తిరిగి వెళుతూ లేచి నిలుచుని నమస్కరించి వెళ్లాయి. ఎలుగుబంట్లు వచ్చి వెళ్లిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప

